Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వరద ఖర్చులు ఇవిగో ఫేక్ జగన్..!
posted on: Oct 9, 2024 1:58PM

వరద బాధితులను ఆదుకునే విషయంలో ప్రభుత్వం చేసిన ఖర్చు విషయంలో వైసీపీ నాయకులు నోటికి వచ్చిన లెక్కలు చెబుతున్నారన్న అభిప్రాయాలను తెలుగుదేశం వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి నారా లోకేష్ ‘ఎక్స్’ ద్వారా ఒక మెసేజ్ విడుదల చేశారు. ‘‘వరద బాధితులకు ఇస్తామన్న కోటి రూపాయలలో ఒక్క రూపాయి ఇప్పటికీ ఇవ్వలేదు ఫేక్ జగన్.. వరద బాధితులకు ఒక వాటర్ ప్యాకెట్ కానీ, ఒక బిస్కెట్ ప్యాకెట్ కానీ పంపిణీ చేయని ఫేక్ జగన్ వరద సహాయక చర్యలపై విషం కక్కుతున్నాడు. వరద ప్రాంతాల్లో కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకు 23 కోట్లు అంటూ ఫేక్ ప్రచారం చేయిస్తున్నాడు. వీటికి ఖర్చు 23 లక్షలు కూడా కాలేదు. జగన్ చీకటి పాలనలో వెలువడిన చీకటి జీవోలు, చీకటి లెక్కలు కాదు కూటమి ప్రభుత్వానివి.. ఇవిగో ఖర్చుల లెక్కలు.. అన్నీ పారదర్శకంగా ఉన్నాయి.. చదువు వస్తే చదువుకో.. కళ్ళుంటే చూడు.. తాడేపల్లి ప్యాలెస్ కలుగులో దాక్కుని ప్రజాధనం కోట్లు పందికొక్కులా ఎగ్ పఫ్లు మెక్కి, నిమ్మకాయ నీళ్లులా తాగేసిన ఫేక్ జగన్ ఇకనైనా నీ ఫేక్ ప్రచారాలు ఆపు.. ...నారా లోకేష్, విద్య, ఐటి శాఖల మంత్రి’’ అని ఆ మెసేజ్లో పేర్కొన్నారు. దానితోపాటు వరద ఖర్చుల జాబితాను కూడా విడుదల చేశారు.






