చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో ఐదుగురికి మరణశిక్ష
posted on: Oct 31, 2025 12:23PM

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో చిత్తూరు అదనపు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ హత్య కేసులో మేయర్ అనూరాధ భర్త తరఫు బంధువు సహా ఐదుగురికి ఉరి శిక్ష విధించింది. చిత్తూరు మేయర్ కఠారి దంపతుల హత్య కేసులో జిల్లా కోర్టు న్యాయమూర్తి శుక్రవారం ఉదయం తీర్పు వెలువరించారు. ఐదుగురు నిందితులకు మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రభుత్వ కార్యాలయంలోనే ఈ హత్య జరగడాన్ని పదేళ్ల క్రితం ఈ హత్య జరిగింది. మేయర్ కఠారి అనూరాధ, ఆమె భర్త కఠారి మోహన్ లు మృతి చెందారు.
2015 నవంబరు 17న చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఈ హత్యలు జరిగాయా. ఈ కేసులో మేయర్ దంపతుల మేనల్లుడు చంద్రశేఖర్ అలియాస్ చింటూతో పాటు ఇరవై రెండు మందిపై కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న చంద్రశేఖర్ అలియాస్ చింటూ, వెంకటాచలపతి, జయప్రకాశ్ రెడ్డి, మంజునాధ్, వెంకటేశ్ లపై నేరం రుజువు కావడంతో వీరికి మరణశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది.






