అమెరికా, ఇరాన్ మధ్య ముగిసిన తొలి విడత శాంతి చర్చలు.. కుదిరిన ఒప్పందాలేంటంటే?

posted on: Jun 22, 2026 10:24AM

అంతర్జాతీయ రాజకీయాల్లో అత్యంత ఉత్కంఠ రేపిన అమెరికా, ఇరాన్ దేశాల ఉన్నత స్థాయి శాంతి చర్చలు ముగిశాయి.  స్విట్జర్లాండ్‌లోని  బర్గెన్‌స్టాక్ నగరంలో జరిగిన ఈ  తొలి విడత చర్చలలో   నాటకీయ పరిణామాలు జరిగాయి. ఒక దశలో చర్చలు అర్ధంతరంగా ముగిసిపోయాయా? అన్న అనుమానాలు సైతం తలెత్తాయి. అయితే.. చివరికి ఈ చర్చలు సానుకూలంగా ముగియడంతో ప్రపంచ వ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోంది.  ప్రపంచ దేశాలననీ అత్యంత ఆసక్తితో    ఈ భేటీలో ఇరు దేశాల మధ్య నెలకొన్న సుదీర్ఘ ప్రతిష్టంభనను తొలగించే దిశగా ఒక ముందడుగు పడింది. వచ్చే 60 రోజుల్లో సంపూర్ణమైన తుది ఒప్పందాన్ని కుదుర్చుకోవడమే లక్ష్యంగా ఇరు దేశాలు ఒక స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసుకోవడం ఈ చర్చల్లో సాధించిన అతిపెద్ద విజయంగా చెప్పవచ్చు.

అయితే..  ఈ శాంతి చర్చల ప్రక్రియ ప్రారంభమైన కొద్దిసేపటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఇరాన్ ను తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తే సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టు   కలకలం రేపింది. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్  ట్రూత్ సోషల్  వేదికగా ట్రంప్  ఇరాన్ తన ప్రాక్సీ గ్రూపులను అదుపులో పెట్టుకోకుంటే..  గత వారం కంటే ఘోరమైన, తీవ్రమైన దాడులు ఎదుర్కోవాల్సి వస్తుందం టూ హెచ్చరించారు. అలాగే.. అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హ‌ర్మూజ్ జలసంధిని తిరిగి తెరవకపోతే ఇరాన్‌పై బాంబుల వర్షం కురిపిస్తామని, చర్చల కోసం వచ్చిన ఇరాన్ ప్రతినిధుల బృందాన్ని కిడ్నాప్ చేస్తామంటూ ఆ పోస్టులో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  

ట్రంప్ చేసిన ఈ అవమానకరమైన, బెదిరింపు వ్యాఖ్యలపై ఇరాన్ ప్రతినిధులు   ఆగ్రహం వ్యక్తం చేసి చర్చలను బాయ్ కాట్ చేస్తున్నట్లు ప్రకటించి వాకౌట్ చేశారు.  దీంతో చర్చలు విఫలమై కథ మళ్లీ మొదటికొచ్చిందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.  అయితే.. ఇరు దేశాల మధ్యా శాంతి కోసం మీడియేట్ చేస్తున్న పాకిస్థాన్,  దేశాలు రంగంలోకి దిగాయి. ఇరుపక్షాలతో  సంప్రదింపులు జరిపి, వారిని మళ్లీ చర్చల టేబుల్ ముందుకు తీసుకువచ్చాయి.  

తొలి విడత భేటీలో ..  చర్చల పురోగతిని నిరంతరం పర్యవేక్షించేందుకు, సరైన రాజకీయ మార్గనిర్దేశం చేసేందుకు ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటుకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ కమిటీ పరిధిలో అణు కార్యక్రమాలు, ఆర్థిక ఆంక్షల ఎత్తివేత, పర్యవేక్షణ వంటి ప్రత్యేక అంశాలపై వర్కింగ్ గ్రూపులు పనిచేసి నివేదికలు సమర్పిస్తాయి. దీనితో పాటు, ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హ‌ర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకల భద్రతను నిర్ధారించడానికి ఇరు దేశాల మధ్య ఒక ప్రత్యేక కమ్యూనికేషన్ లైన్‌ను ఏర్పాటు చేస్తారు. రాబోయే 60 రోజుల్లోగా శాశ్వత శాంతి ఒప్పందాన్ని ఖరారు చేయడమే లక్ష్యంగా ఇరు దేశాలు ముందుకు సాగుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు తగ్గుతాయని అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...