Latest News
తొలి దశ జనగణన షురూ!
posted on: Apr 1, 2026 5:26PM

దేశవ్యాప్తంగా 16వ జనగణన ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం అయ్యింది. తొలి దశలో భాగంగా గృహగణన కార్యక్రమాన్ని చేపట్టారు. స్వతంత్ర భారత చరిత్రలో ఎనిమిదోదైన ఈ సెన్సస్ను తొలిసారిగా పూర్తి డిజిటల్ రూపంలో నిర్వహిస్తున్నారు. జనగణనలో సేకరించే సమాచారం అత్యంత గోప్యంగా ఉంటుందని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా, సెన్సస్ కమిషనర్ మృత్యుంజయ్కుమార్ నారాయణ్ చెప్పారు.
ఈ వివరాలను ఏ ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థలతో పంచుకోరనీ, వీటిని న్యాయస్థానాల్లో సాక్ష్యాలుగా కూడా పరిగణించరని తెలిపారు. ఈ డేటా సమాచార హక్కు చట్టం పరిధిలోకి రాదన్నారు. ఈ వివరాల ఆధారంగా ప్రభుత్వ పథకాల్లో ఎటువంటి కోత విధించడం లేదా కొత్తవి మంజూరు చేయడం కూడా జరగదని తెలిపారు.






