Latest News

తొలి దశ జనగణన షురూ!

posted on: Apr 1, 2026 5:26PM

దేశవ్యాప్తంగా   16వ జనగణన ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం  అయ్యింది.  తొలి దశలో భాగంగా గృహగణన  కార్యక్రమాన్ని చేపట్టారు.  స్వతంత్ర భారత చరిత్రలో ఎనిమిదోదైన ఈ సెన్సస్‌ను తొలిసారిగా పూర్తి డిజిటల్ రూపంలో నిర్వహిస్తున్నారు. జనగణనలో సేకరించే సమాచారం అత్యంత గోప్యంగా ఉంటుందని రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా, సెన్సస్‌ కమిషనర్‌ మృత్యుంజయ్‌కుమార్‌ నారాయణ్‌ చెప్పారు.

ఈ వివరాలను ఏ ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థలతో పంచుకోరనీ, వీటిని న్యాయస్థానాల్లో సాక్ష్యాలుగా కూడా పరిగణించరని తెలిపారు.  ఈ డేటా సమాచార హక్కు చట్టం  పరిధిలోకి రాదన్నారు. ఈ వివరాల ఆధారంగా ప్రభుత్వ పథకాల్లో ఎటువంటి కోత విధించడం లేదా కొత్తవి మంజూరు చేయడం కూడా జరగదని తెలిపారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...