ఒంటిమిట్టలో అగ్నిప్రమాదం

posted on: Apr 2, 2026 10:28AM

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన కోదండ రామస్వామి కళ్యాణానికి కొద్ది సేపటి ముందు బుధవారం (ఏప్రిల్ 1)  ఆలయం సమీపలోఅగ్నిప్రమాదం సంభవించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టువస్త్రాలు సమర్పించడానికి ముందు ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

వెంటనే అలర్ట్ అయిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. శ్రీరామ రథం సమీపంలో ఉన్న జనరేటర్ వాహనంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు రేగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఎటువంటి ప్రమాదం లేకుండా మంటలు వెంటనే అదుపులోనికి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...