Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పిల్లలను హత్య చేసి తండ్రి ఆత్మహత్య
posted on: Apr 28, 2026 2:00PM
.webp)
మహబూబాబాద్ జిల్లాలో ఓ తండ్రి తన ఇద్దరు కన్నబిడ్డలను హత్య చేసి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నహృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. తొర్రూర్ శివారు అమ్మాపురం గ్రామానికి చెందిన కిన్నెర గుంశావలి కుటుంబ కలహాలతో తీవ్ర మనస్తాపానికి గురై తన ఇద్దరు కుమారులను స్థానిక వ్యవసాయ మార్కెట్ ఎదురుగా ఉన్న కాలీఫ్లవర్ పొలంలోని వేప చెట్టుకు ఉరేసి చంపేసి అనంతరం తానుకూడా ఆ చెట్టుకే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ కలహాలే ఇందుకు కారణమని ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు.


.webp)



