ములకలచెరువు కల్తీ మద్యం కేసులో మరో అరెస్టు

posted on: Oct 13, 2025 6:00PM

 

అన్నమయ్య జిల్లా  ములకలచెరువు కల్తీ మద్యం కేసులో ఏ 22 నిందితుడిగా ఉన్న చైతన్య బాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  నకిలీ మద్యం కేసులో ఇప్పటివరకు అరెస్టు అయిన వారి సంఖ్య 15కి చేరింది. ఈ కేసులో ఎనిమిది మందిని అరెస్టు చేయాల్సి ఉంది. మరి కొంతమందిపై కేసు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. కూటమి ప్రభుత్వం ఈ కేసుని సిట్‌‌కి అప్పగించన సంగతి తెలిసిందే. 

నకిలీ లిక్కర్ తయారీతో సంబంధం ఉన్న వ్యక్తుల్లో టెన్షన్ పెరిగింది. ఆరోపణలు ఎదుర్కొంటూ ఏ (17) నిందితునిగా కేసు నమోదైన టీడీపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన తంబళ్లపల్లె నియోజకవర్గం ఇన్‌చార్జ్ దాసరపల్లి జయచంద్రారెడ్డి, ఆయన బామ్మర్థి గిరిధర్ రెడ్డిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...