Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పెళ్లి పేరుతో 67 మందికి వలపు వల...నకిలీ సీఐఎస్ఎఫ్ అధికారి అరెస్ట్
posted on: Apr 14, 2026 5:36PM

శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద నకిలీ సీఐఎస్ఎఫ్ అధికారిగా తిరుగుతున్న వ్యక్తిని అసలు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) సిబ్బంది పట్టుకున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన బాలకృష్ణ అనే వ్యక్తి సీఐఎస్ఎఫ్ యూనిఫామ్ ధరించి ఎయిర్పోర్టు పరిసరాల్లో తిరుగుతూ ఫోటోలు దిగుతున్నాడు. అతని ప్రవర్తనపై అనుమానం కలిగిన సీఐఎస్ఎఫ్ సిబ్బంది అతడిపై నిఘా పెట్టి, అనంతరం అదుపులోకి తీసుకుని విచారించారు.
విచారణలో బాలకృష్ణ సీఐఎస్ఎఫ్ అధికారిగా నటిస్తూ మ్యాట్రిమోని వెబ్సైట్ల ద్వారా యువతులతో పరిచయాలు పెంచుకుని మోసాలకు పాల్పడుతున్నట్టు బయటపడింది. మొదటి భార్య వదిలి వెళ్లిపోవడంతో రెండో వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతోనే తాను సీఐఎస్ఎఫ్ అధికారిగా నటించినట్లు ప్రాథమిక విచారణలో ఒప్పుకున్నాడు. అతని మొబైల్ ఫోన్ పరిశీలనలో వందలాది యువతులతో చాటింగ్ చేసిన ఆధారాలు లభించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అతడిని అదుపులో ఉంచి మరింత లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో ఎయిర్పోర్టు భద్రతా వ్యవస్థ అప్రమత్తమైంది.
ఈ కేసులో మరో సంచలన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. బాలకృష్ణకు ఇప్పటికే పెళ్లై ఒక కుమార్తె ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. పెళ్లికి ముందు మరో యువతితో ప్రేమ సంబంధం ఉన్న అతడు, ఆ యువతి ఇటీవల విడాకులు తీసుకున్న నేపథ్యంలో మళ్లీ ఆమెను సంప్రదించాడు. “మనిద్దరం పెళ్లి చేసుకుందాం” అని ఒత్తిడి చేయగా, ప్రభుత్వ ఉద్యోగం ఉంటేనే ఇంట్లో వాళ్లు ఒప్పుకుంటారని యువతి చెప్పింది.
దీంతో తాను సీఐఎస్ఎఫ్లో చేరి ప్రస్తుతం ట్రైనింగ్లో ఉన్నానని అబద్ధం చెప్పాడు. తన మాట నమ్మించే ప్రయత్నంలో భాగంగా సీఐఎస్ఎఫ్ యూనిఫామ్ కొనుగోలు చేసి, దానిని ధరించి ఎయిర్పోర్ట్లో ఫోటోలు దిగాడు. ఆ ఫోటోలను యువతికి పంపే సమయంలోనే భద్రతా సిబ్బందికి అనుమానం రావడంతో అతడు పట్టుబడ్డాడు. ఇదే తరహాలో మ్యాట్రిమోని వెబ్సైట్లు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా అనేక మంది యువతులతో పరిచయాలు పెంచుకుని మోసాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు 60 మందికి పైగా మహిళలు, యువతులను మోసం చేసినట్లు ప్రాథమికంగా తేలింది. ఈ కేసులో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.






