కబాడ్డార్ కొడకల్లారా! ఈటెల

posted on: Aug 13, 2013 4:30PM

 

ఈ రోజు హైదరాబాద్ విద్యుత్ సౌధాలో జరిగిన తెలంగాణా విద్యుత్త్ ఉద్యోగుల ధర్నాలో పాల్గొన్న తెరాస నేత ఈటెల రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రుల భార్యలు సమైక్యాంధ్ర కోరుతూ గవర్నర్ నరసింహన్ న్ను కలవడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. ‘తెలంగాణాలో వేయి మంది యువకులు బలిదానాలు చేసుకొంటే చూస్తూ కూర్చొన్న మీ భర్తలని నిలదీయకుండా, ఇప్పుడు తెలంగాణా రాష్ట్రం ఏర్పడే సమయంలో వచ్చి సమైక్యాంధ్ర కోరడం ఖండిస్తున్నామని’ అన్నారు. ఎన్నో ఏళ్లుగా ఉద్యమాలు చేసి సాధించుకొన్న తెలంగాణాను అడ్డుకొంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెపుతూ “కబాడ్డార్ కొడకల్లారా!” అని ఈటెల హెచ్చరించారు. ఒకరిపై మరొకరు రెచ్చగొట్టే విధంగా మాట్లాడవద్దని కాంగ్రెస్ అధిష్టానం పదే పదే కోరుతునప్పటికీ, ఆయన మాటలను ఎవరూ ఖాతరు చేసే ఆలోచనలో లేరని అర్ధం అవుతోంది. ఇటువంటి మాటల వలన తెరాస నేతలే రాష్ట్ర విభజన ప్రక్రియకు అడ్డుపడుతున్నట్లవుతుంది. అదే జరిగితే ఈటెల చెపుతున్నట్లు హైదరాబాద్ లో తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడటం ఖాయం. అప్పుడు తెలంగాణా ఏర్పాటు చేయాలనే కృత నిశ్చయంతో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం, ఉద్రిక్తతలను నియంత్రించేందుకు హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించి, మిగిలిన ప్రాంతంలో రాష్ట్రపతి పాలన విదించే అవకాశం ఉంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...