సీట్లకి కృత్రిమ డిమాండ్ సృష్టిస్తున్నారా?
posted on Apr 9, 2014 4:17PM
.jpg)
రాజకీయ పార్టీలు సీట్లకు కృత్రిమ డిమాండ్ సృష్టిస్తూ, ఆయా సీట్ల కోసం అభ్యర్థులు పోటీ పడేలా చేసి కృత్రిమ డిమాండ్ సృష్టిస్తున్నారన్న అనుమానాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఇలా డిమాండ్ సృష్టించడం ద్వారా పార్టీలకు ఆర్థికంగా బాగా గిట్టుబాటు అవుతున్నట్టు కనిపిస్తోందని పరిశీకులు అంటున్నారు. రాష్ట్రంలో చాలా సీట్ల విషయంలో అనేకమంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. చాలా సీట్లను పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు ఆశిస్తున్నారు. వారిలో ఆయా టిక్కెట్ల మీద భారీగా ఆశలు పెంచిన తర్వాత, పార్టీలోని కొంతమంది సదరు టిక్కెట్లను ఆశిస్తున్నట్టు ఇష్యూ క్రియేట్ చేస్తున్నారు. ఈ టిక్కెట్ మీకు ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తున్నామని సదరు సౌండ్ పార్టీలకు చెబుతున్నారు. దాంతో పారిశ్రామికవేత్తలు ఎంత ఖర్చయినా పర్లేదు నాకు టిక్కెట్ కావాల్సిందేనని పట్టుపట్టేట్టు చేస్తున్నారు. దాంతో పార్టీల అధ్యక్షులు భారీ స్థాయిలో ‘పార్టీఫండ్’ డిమాండ్ చేసి వారికి టిక్కెట్లు ఇస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో చేతులు మారుతున్న డబ్బు 40 కోట్లు దాటిన సందర్భాలు కూడా కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీకులు చెబుతున్నారు. ఈ ధోరణి ఏ ఒక్క పార్టీలోనో కాకుండా.. అన్ని పార్టీల్లోనూ కనిపిస్తోందని అంటున్నారు. పంచ్ లైన్ సీట్ ఫర్ సేల్