మహోగ్రరూపం దాల్చిన తెలంగాణ నయాగరా.. బొగత జలపాతం సందర్శన నిలిపివేత.!

posted on: Jul 29, 2026 2:50PM

తెలంగాణ నయాగరాగా పేరుగాంచిన  బొగత జలపాతం ఉగ్రరూపం దాల్చింది. ములుగు జిల్లాలోని ఈ బొగత జలపాతం ప్రకృతి ప్రేమికులను ఎంతగానో  ఆకట్టుకునే ఈ బొగత జలపాతం ప్రస్తుతం ఒకే సమయంలో అద్భుత ప్రకృతి అందం, జల ప్రళయాన్ని తలపింపచేసే  ఉగ్రరూపంతో భయపెడుతోంది. 

ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి వద్ద ఉన్న ఈ సహజసిద్ధ జలపాతం గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పరవళ్లు తొక్కుతోంది. ప్రకృతి అందాలకు నిలయమైన ఈ ప్రాంతం ఇప్పుడు   అధికారులకు  సవాలుగా మారింది. తెలంగాణ నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది పర్యాటకులు ప్రతిరోజూ బొగత జలపాతాలను తిలకించడానికి వస్తుంటారు. అయితే ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితుల కారణంగా అధికారులు పర్యాటకులను అనుమతించడంలేదు. 

బంగాళాఖాతంలో ఏర్పడిన బలమైన వాయుగుండం ప్రభావంతో గ  దట్టమైన అటవీ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు భాకీగా నీరు బొగత జలపాతంలోకి  చేరడంతో బొగత వద్ద నీటిమట్టం   ప్రమాదకర స్థాయికి పెరిగింది. సాధారణంగా ప్రశాంతంగా, సుందరంగా కనిపించే ఈ తెలంగాణ నయాగరా ఇప్పుడు  నీటి ప్రవాహంతో హోరెత్తుతోంది. నీటి ఉధృతి ఏ స్థాయిలో ఉందంటే, చాలా దూరంలో ఉన్నవారికి కూడా ఆ శబ్దం ఎంతో స్పష్టంగా  వినిపిస్తోంది.

ఈ భారీ ప్రవాహం వల్ల జలపాతం పరిసరాల్లో ఉన్న  రాళ్లు జారే ప్రమాదం పొంచి ఉందని గుర్తించిన అధికారులు పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని  బొగత జలపాతం సందర్శనను తాత్కాలికంగా పూర్తిగా నిలిపివేశారు. ఈ మేరకు  ప్రకటన విడుదల చేశారు. ముందస్తు జాగ్రత్త చర్యగా అటవీ  సిబ్బంది, పోలీసులు కలిసి జలపాతం వద్ద భద్రతను   పెంచారు. ఎవరూ నీటి వద్దకు వెళ్లకుండా దారి పొడవునా  బారికేడ్లను ఏర్పాటు చేశారు. మైకుల ద్వారా పర్యాటకులను హెచ్చరిస్తూ వెనక్కి పంపుతున్నారు. 

Bogatha Waterfalls,  Mulugu Heavy Rains, Bogatha Floods, Wazeedu Cheekupally, Bogatha Entry Closed

google-ad-img
    Related Sigment News
    • Loading...