Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రాజ్ కేసిరెడ్డి అరెస్ట్.. ఈడీ నెక్ట్స్ టార్గెట్ ఎవరో తెలుసా?!
posted on: Jun 11, 2026 3:02PM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను, అధికార వర్గాలను కుదిపేసిన మద్యం కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రాజ్ కేసిరెడ్డిని అరెస్టు చేసింది. వైసీపీ హయాంలో ఐటీ సలహాదారుగా, వైసీపి ఎన్నారై విభాగంలో కీలకంగా వ్యవహరించిన రాజ్ కేసిరెడ్డిని ఈడీ అధికారులు గురువారం (జూన్ 11) అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు పదికి పైగా కీలక ప్రాంతాల్లో ఒకేసారి విస్తృతంగా సోదాలు నిర్వహించిన అనంతరం రాజ్ కేసిరెడ్డిని అరెస్టు చేయడం గమనార్హం. ఈ కుంభకోణంపై ఏర్పాటైన ఏపీ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) శంషాబాద్ ఎయిర్పోర్టులో నాటకీయ పరిణామాల మధ్య రాజ్ కేశిరెడ్డిని గతే ఏడాది ఏప్రిల్లోనే అరెస్టు చేసింది. మద్యం కుంభకోణం కేసులో రాజ్ కేసిరెడ్డి ఏడాది జైలులోనే ఉన్నారు. అయితే.. ఇప్పుడు తాజాగా రంగంలోకి దిగిన ఈడీ.. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఆయనను అరెస్టు చేయడం రాజకీయవర్గాలలోకలకల రేపుతోంది.
గతంలో సిట్ కేవలం సాధారణ అవినీతి నిరోధక చట్టాల కింద విచారణ జరపగా, ఈడీ ఎంట్రీ తో కథ కొత్త మలుపు తిరిగింది. మద్యం సిండికేట్లు, వివిధ షెల్ కంపెనీల ద్వారా సేకరించిన దాదాపు 3,500 కోట్ల రూపాయల భారీ ముడుపులు ఎక్కడెక్కడికి చేరాయి? హవాలా మార్గాల ద్వారా విదేశీ ఖాతాల్లోకి ఎలా తరలిపోయాయి? అనే మనీ ట్రయిల్ గుట్టును పూర్తిగా రట్టు చేసేందుకు ఈడీ సిద్ధమైంది. ఇప్పటికే సిగ్మా సప్లై చైన్, టెక్కర్ వంటి బినామీ సంస్థల ద్వారా సాగిన మనీ లాండరింగ్ వ్యవహారాలపై దర్యాప్తు సంస్థ ఆధారాలు సేకరించింది. ఈ క్రమంలోనే సుమారు 441 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ కూడా చేసింది.
ఏపీ మద్యం కుంభకోణంలో దర్యాప్తు సంస్థల దాడులు, విచారణల తీరు గమనిస్తుంటే, ఈ బాగోతం తాలూకు వేళ్లు అల్టిమేట్గా తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తున్నాయనే చర్చ రాజకీయ జోరుగా నడుస్తోంది. రాజ్ కేసిరెడ్డి గత ప్రభుత్వంలో నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి అత్యంత సన్నిహితుడిగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. గతంలో వైసిపి సీనియర్ నేత విజయసాయిరెడ్డి సైతం ఈడీ విచారణకు హాజరైనప్పుడు, మద్యం పాలసీ వెనుక ఉన్న ఆర్థిక లావాదేవీలు సర్వస్వం రాజ్ కేసిరెడ్డికే తెలుసని.. ఆయనే దీనికి అసలైన మాస్టర్మైండ్ అని సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. రాజ్ కేసిరెడ్డి వ్యక్తిగతంగా నిర్వహించిన జూబ్లీహిల్స్ ఆఫీస్ నుంచే ఈ భారీ వసూళ్ల నెట్వర్క్ అంతా నడిచిందని అధికారులు పక్కాగా గుర్తించారు.
ప్రస్తుతం రాజ్ కేసిరెడ్డి ఈడీ కస్టడీలోకి వెళ్లడంతో ఈ మహా కుంభకోణం తాలూకు అసలైన లబ్ధిదారులు ఎవరనేది త్వరలోనే తేలిపోయే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. . వైసీపికి చెందిన ఒక సిట్టింగ్ లోక్సభ సభ్యుడితో పాటు మరికొందరు కీలక నేతలకు చేరినముడుపుల) గుట్టు ఇప్పటికే ఛేదించిన ఈబీ.. ఈ మనీలాండరింగ్ లింకుల ఆధారంగా, రానున్న రోజుల్లో వైసిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కూడా విచారణకు పిలుస్తూ.. నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇలా ఉండగా రాజ్ కేసిరెడ్డి అరెస్టు తరువాత ఈడీ లక్ష్యం ఎవరన్న ఆసక్త కూడా సర్వత్రా వ్యక్తం అవుతోంది.


.webp)



