Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఇథనాల్ మంటల్లో దేశభద్రత.. ఈ 20 పై డీప్ ఫేక్ దాడి వెనుక అసలు కథేంటి?
posted on: Jul 31, 2026 5:13AM

ఇథనాల్ బ్లెండింగ్ కథ నిన్న మొన్నటిది కాదు. 2003 లో అప్పటి వాజ్ పేయియి ప్రభుత్వం ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అప్పుడు లక్ష్యం కేవలం 5 శాతం. 2013-14 నాటికి దేశవ్యాప్త బ్లెండింగ్ 1.5 శాతం కూడా దాటలేదు. ఇథనాల్ సేకరణ కేవలం 38 కోట్ల లీటర్లు మాత్రమే.
ఈ విషయంలో కీలక మలుపు చోటు చేసుున్నది 2018లో . జాతీయ జీవ ఇంధన విధానం విడుదలైంది 2020 లో ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుని 2030 నాటిఈ 20 లక్ష్యాన్ని 2025-26 కి ముందుకు జరిపింది. చెరకు మాత్రమే కాదు, నష్టపోయిన ధాన్యం, విరిగిన బియ్యం, మొక్కజొన్న, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వద్ద మిగులు బియ్యం కూడా ముడిసరుకుగా అనుమతించింది. ఫలితం.. దేశంలో ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం 2014 లో 421 కోట్ల లీటర్ల నుండి 2026 నాటికి సుమారు 2000 కోట్ల లీటర్లకు పెరిగింది. సేకరణ 1200 కోట్ల లీటర్లను దాటింది. ప్రపంచంలో 60 కి పైగా దేశాలు ఇదే మార్గంలో ఉన్నాయన్నది వాస్తవం. బ్రెజిల్ 27 శాతం వరకు బ్లెండింగ్ చేస్తోంది. భారత్ ఆలస్యంగా వచ్చినా, వేగంగా పరుగెడుతోంది.
దీని వెనుక లెక్కలు స్పష్టం. భారత్ ఏటా 14 నుండి 18 లక్షల కోట్ల రూపాయల ముడిచమురు దిగుమతి చేసుకుంటోంది. రష్యా, ఇరాక్, సౌదీ అరేబియా, యుఏఈ, అమెరికా నుండి వచ్చే ఈ చమురుపై ఆధారపడటం తగ్గితేనే రూపాయి విలువ, విదేశీ మారక నిల్వలు నిలబడతాయి. ఈ20 వల్ల కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి, చెరకు, మొక్కజొన్నపంటలకు అదనపు గిరాకీ లభించి రైతుకు ప్రయోజనం చేకూరుతుంది. గ్రామీణ ప్రాంతంలో డిస్టిలరీల ద్వారా ఉపాధి పెరుగుతుంది. ఇది ఇంధన భద్రతకు, రైతు భద్రతకు ముడిపడిన అంశం.
సంఘటనల కాలక్రమం: విజయం నుండి వివాదం వరకు
డిసెంబర్ 2025 లో భారత్ ఈ20 లక్ష్యాన్ని అధికారికంగా సాధించినట్లు ప్రకటించింది. దేశంలోని దాదాపు 90 వేల పెట్రోల్ బంకుల్లో ఈ20 మాత్రమే లభ్యం కావడం ప్రారంభమైంది. అక్కడే అసంతృప్తి మొదలైంది. 2023 కి ముందు తయారైన వాహనాల యజమానులు మైలేజ్ తగ్గిందని, ఇంజన్లో తుప్పు పడుతోందనీ, రబ్బరు పార్టులకు నష్టం వస్తోందని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. కొందరు 20-30 శాతం మైలేజ్ పడిపోయిందని ఆరోపించారు.
ఈ అసంతృప్తిని ఆసరాగా చేసుకుని ఒక కృత్రిమ ప్రచారం పుట్టుకొచ్చింది. జూలై 2026 మొదటి వారంలో సుప్రీంకోర్టులో ఇథనాల్ సేకరణ కేసు విచారణ సందర్భంగా అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి ఈ20 ని ప్రయోగం అని అన్నట్లుగా ఒక వీడియో క్లిప్ వైరల్ అయింది. దీనిని ప్రభుత్వం ఖండించినా, నష్టం జరిగిపోయింది. అదే సమయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ20 కి వ్యక్తిగతంగా బాధ్యుడని, ఆయన కుటుంబానికి చెందిన కంపెనీలే ఇథనాల్ వ్యాపారంతో లాభపడుతున్నాయని, ఆయన గొంతు, ముఖంతో కృత్రిమ మేధ తో తయారుచేసిన డీప్ ఫేక్ వీడియోలు, రీల్స్, అసభ్య పదజాలంతో కూడిన పోస్టులు ఫేస్ బుక్, , ఇన్స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్ లలో చక్కర్లు కొట్టాయి.
న్యాయపరమైన అంశాలు.. వ్యక్తిత్వ హక్కుల కోసం పోరాటం
దీనిపై నితిన్ గడ్కరీ కోర్టును ఆశ్రయించారు. నితిన్ గడ్కరీ తరఫు న్యాయవాది సందీప్ ఎస్. లడ్డా బొంబాయి హైకోర్టులో లెటర్స్ పేటెంట్లోని క్లాజ్ XII కింద పిటిషన్ దాఖలు చేశారు. ఇది ఒక సాంకేతికమైన, కీలకమైన న్యాయపరమైన అంశం. ఇంటర్నెట్లో ప్రచురించబడిన కంటెంట్ ముంబైలోని యూజర్లకు అందుబాటులో ఉంది కాబట్టి, దాని పర్యవసానంలో ఒక భాగం ముంబై పరిధిలో జరిగినట్లుగా పరిగణించి, కోర్టుకు విచారణ అర్హత ఉందని వాదించారు. అదే సమయంలో కంటెంట్ ముంబై వెలుపల కూడా అందుబాటులో ఉన్నందున, ప్రత్యేక అనుమతి అవసరమని కోరారు.
జస్టిస్ అభయ్ అహుజా ఈ వాదనను అంగీకరించి, సివిల్ దావా దాఖలుకు అనుమతి ఇచ్చారు. ఇది తుది తీర్పు కాదు, దావా వేసుకోవడానికి తలుపులు తెరిచిన ఉత్తర్వు మాత్రమే. అసలు దావా ఇకపై జస్టిస్ ఆరిఫ్ డాక్టర్ ముందు విచారణకు రానుంది.
ఈ దావాలో ప్రతివాదులుగా మెటా ప్లాట్ ఫారమ్ లు ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్), X కార్ప్, యూట్యూబ్ , కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, టెలికమ్యూనికేషన్స్ విభాగం, ఇతరులు ఉన్నారు. కాగా ఈ పిటిషన్ లో గడ్కరీ 11 కోట్ల రూపాయల నష్టపరిహారం కోరారు.
పిటిషన్ లో అత్యంత ముఖ్యమైన అంశం ఏమిటంటే.. గడ్కరీ స్వయంగా ఈ 20 విధానం పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ పరిధిలోనిదని, తనది రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ అని స్పష్టం చేశారు. తన పేరు, ముఖం, గొంతు, వ్యక్తిగత పోలికలను అనుమతి లేకుండా ఏఐ ద్వారా అనుకరించడం వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘన అనీ, ఆ కంటెంట్ తన ప్రతిష్టకు కోలుకోలేని నష్టం కలిగించిందని గడ్కరీ తన పిటిషన్ లో పేర్కొన్నారు. అదే సమయంలో.. వాస్తవాల ఆధారంగా, దురుద్దేశం లేకుండా చేసే న్యాయమైన విమర్శను తాను అడ్డుకోవడం లేదని కూడా పిటిషన్లో స్పష్టంగా పేర్కొన్నారు. తన దావా విమర్శపై కాదనీ, , అబద్ధపు ప్రచారంపైనేననీ స్పష్టం చేశారు.
రాజకీయ, సామాజిక, మీడియా కోణాలు.. రెజీమ్ ఛేంజ్ నినాదం వెనుక నిజం
రెజీమ్ ఛేంజ్ ఆపరేషన్ అనే మాట ఇప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి విమర్శ వెనుక విదేశీ కుట్ర ఉందని చెప్పడం సులభం. కానీ వాస్తవాలను చూస్తే చిత్రం వేరుగా ఉంది. ఒకవైపు ప్రభుత్వం చెబుతున్న లెక్కలు ఉన్నాయి. ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ అధ్యయనాల ప్రకారం ఈ20 వల్ల మైలేజ్ తగ్గుదల 2నుంచి 3 శాతం మాత్రమేనని, వారంటీకి ఎటువంటి నష్టం లేదని ప్రభుత్వం 15 పేజీల ఫ్యాక్ట్ షీట్ విడుదల చేసింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్మే 2026 లోఈ22 నుండి ఈ30 వరకు ప్రమాణాలను కూడా నోటిఫై చేసింది.
మరోవైపు వాహనదారుల ఆందోళన కూడా అంతే నిజం. లైవ్మింట్ సర్వే ప్రకారం 53 శాతం వాహన యజమానులు ఈ20 ని వినాశకరం అని, 66 శాతం మంది మైలేజ్ తగ్గిందని చెప్పారు. లక్నోలోని పెట్రోల్ బంక్ నిర్వాహకులు వినియోగదారుల ఆగ్రహానికి భయపడి ఈ20 మాటే ఎత్తడం మానేశారని రాయిటర్స్ కథనం పేర్కొంది. పాత వాహనాలకు ఈ10, ఈ5 ఆప్షన్ లేకుండా చేయడంపై ప్రజల్లో అసహనం ఉంది. ఇది న్యాయమైన ప్రజా చర్చ.
ఈ న్యాయమైన చర్చను డీప్ ఫేక్ లు విషపూరితం చేస్తున్నాయి. "చక్కెర ఉన్న ఇథనాల్కు చీమలు, తేనెటీగలు ఆకర్షితులవుతాయి" అనే అత్యంత హాస్యాస్పదమైన అబద్ధం నుండి, గడ్కరీ కుటుంబం లాభపడుతోందనే ఆర్థిక నేరారోపణ వరకు - ఇవన్నీ ఏఐ తో తయారుచేసిన అబద్ధాలు. ఇది ప్రభుత్వ విధానంపై విమర్శ కాదు. ఒక వ్యక్తి వ్యక్తిత్వ హననం. ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం. దీనిని రెజీమ్ ఛేంజ్ అనడం కంటే, ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసే ప్రయత్నం అనడం సరైనది.
ప్రభావాలు, ప్రజా చర్చ.. అసలు సమస్య ఎక్కడ?
ఈ వ్యవహారం రెండు పెద్ద ప్రమాదాలను చూపిస్తోంది. మొదటిది, కృత్రిమ మేధ దుర్వినియోగం. 2026 మార్చిలో శశి థరూర్ డీప్ ఫేక్, ఇప్పుడు గడ్కరీ డీప్ ఫేక్. ఎన్నికల సమయంలో కాకుండా, విధానపరమైన చర్చలో కూడా డీప్ ఫేక్ లు ఆయుధంగా మారుతున్నాయి. ఇది భావప్రకటనా స్వేచ్ఛకు కూడా ముప్పు. ఎందుకంటే నిజమైన విమర్శను కూడా ప్రజలు నమ్మకుండా చేస్తుంది.
రెండవది, విధాన అమలులో పారదర్శకత లోపం. ఈ20 మంచి విధానమే అయినా, ప్రజలకు ఎంపిక లేకుండా చేయడం, పాత వాహనాలకు ఏమవుతుందో స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇవ్వకపోవడం, అటార్నీ జనరల్ నోటి నుండి ప్రయోగం అనే మాట రావడం,, ఇవన్నీ అపనమ్మకాన్ని పెంచాయి. పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి రేసింగ్ కార్లలో కూడా వాడతారు, యాక్సిలరేషన్ పెరుగుతుంది అనడం సాంకేతికంగా నిజమే కావచ్చు, కానీ సామాన్యుడి మైలేజ్ బాధను తీర్చదు.
ఈ20 కార్యక్రమం దేశానికి అవసరం. దానిని వ్యతిరేకించడం అంటే 18 లక్షల కోట్ల దిగుమతి బిల్లును, రైతు ఆదాయాన్ని వ్యతిరేకించడమే. కానీ ఆ మంచి కార్యక్రమాన్ని అబద్ధాలతో, డీప్ ఫేక్ లతో ఒక వ్యక్తికి ఆపాదించి, లబ్ధి పొందుతున్నారని ప్రచారం చేయడం నేరం. బొంబాయి హైకోర్టు అనుమతి ఆ నేరంపై పోరాడేందుకు ఇచ్చిన అవకాశం మాత్రమే. ఇది విధానంపై విమర్శను ఆపదు, అబద్ధపు ప్రచారాన్ని ఆపుతుంది. వాస్తవం ఇదే. పనికిరాని విద్వేషాన్ని పక్కన పెట్టి, నిజమైన సాంకేతిక ప్రశ్నలకు సమాధానం వెతకడమే ఇప్పుడు ప్రభుత్వం, సమాజం చేయాల్సిన పని.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.
E20 Petrol India, Nitin Gadkari Deepfake, Ethanol Blending Target, Bombay High Court E20, Fuel Import Savings, E20 Mileage Impact






