దుబాయ్ లోని అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయంపై డ్రోన్ దాడి

posted on: Mar 4, 2026 7:56AM

మిడిల్ఈస్ట్ లో  యుద్ధవాతావరణం భయం గొల్పుతోంది.  వాణిజ్య నగరం దుబాయ్‌ లోని అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయం లక్ష్యంగా  జరిగిన డ్రోన్ దాడి  కలకలం రేపింది. కాన్సులేట్ భవనానికి సమీపంలోని పార్కింగ్ స్థలంలో డ్రోన్  దాడి కారణంగా భారీగా మంటలు చెలరేగాయి.

 సమాచారం అందుకున్న దుబాయ్ సివిల్ డిఫెన్స్ బృందాలు  ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ఘటనలో  ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు.  గత 48 గంటల్లో సౌదీ అరేబియా రాజధాని రియాద్, కువైట్‌లోని అమెరికా రాయబార కార్యాలయాలపై కూడా ఇరాన్ డ్రోన్ల దాడికి పాల్పడింది.  కాగా ఈ పరిణామాలపై యూఏఈ   స్పందిస్తూ.. తమ భూభాగాన్ని ఇతర దేశాలపై దాడులకు వేదికగా మార్చడాన్ని సహించబోమని హెచ్చరించింది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...