అగ్నిపథ్ పథకం గురించి ఆర్మీకి ముందుగా తెలియదా?

posted on: Feb 2, 2026 3:21PM

లోక్ స‌భ‌లో చ‌ర్చకు దారి తీసిన‌ ఆర్మీ మాజీ చీఫ్ మ‌నోజ్ ముకుంద్ న‌ర‌వ‌నె  ఆత్మకథ ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకంలో ఏముంది? ఆ పుస్తకం లోక్ సభను గడగడలాడించడానికి కారణమేంటి?  సోమవారం (ఫిబ్రవరి 2)  న లోక్ సభలో  బడ్జెట్‌పై చర్చ జరుగుతున్న సమయంలో లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ పుస్తకంలోని అంశాలను ప్రస్తావించడంతో సభలో గందరగోళం రేగింది.  ఈ పుస్తకంలో ఉ అగ్నిప‌థ్ పథకం గురించి న‌ర‌వ‌నె ప‌లు సంచ‌ల‌న  విష‌యాలు పేర్కొన్నారు. అస‌లీ ప‌థ‌కం గురించి ఆర్మీకి ముందస్తు స‌మాచారమే లేదని ఆయన తన ఆత్మకథ ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీలో కుండబద్దలు కొట్టేశారు. అప్పట్లో ఇదొక షాకింగ్ అంశమని పేర్కొన్నారు.  తొలుత ఆర్మీ కేవ‌లం  టూర్ ఆఫ్ డ్యూటీలో భాగంగా.. కొంద‌రికి మాత్ర‌మే వ‌ర్తించేలా ఈ పథకాన్ని  ప్ర‌తిపాదించింది. కానీ ప్ర‌భుత్వం దాన్ని అంద‌రికీ వ‌ర్తింప చేస్తూ అగ్నిప‌థ్ గా  మార్చింద‌ని త‌న ఆత్మకథలో న‌ర‌వ‌నె పేర్కొన్నారు. దీనిపై నౌకా, వైమానిక దళాలు సైతం విస్మయం చెందాయన్నారు.  

అలాగే గాల్వ‌న్, ల‌డ‌ఖ్ వంటి చైనా స‌రిహ‌ద్దుల వెంబ‌డి వివ‌రాల్లోకి వెళ్తే.. 2020లో గాల్వ‌న్ లోయ‌లో చైనాతో జ‌రిగిన సంఘ‌ర్ష‌ణ‌ల స‌మ‌యంలోని క్లిష్ట ప‌రిస్థితుల‌ను ఆర్మీ మాజీ  చీఫ్ మనోజ్ ముకుంద్  నరవనె కళ్లకు గట్టారు.  2020 ఆగ‌స్టు 31  నాటి రాత్రి చైనా యుద్ధ ట్యాంకులు ముందుకు దూసుకొస్తున్న‌పుడు.. ర‌క్ష‌ణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ త‌న‌కు ఫోన్ చేసి.. మీకు ఏది మంచి అనిపిస్తే అది చేయ‌మంటూ ఫ్రీ హ్యాండ్ ఇచ్చార‌ని పేర్కొన్న నవరనె..  ఆ సమయంలో యుద్ధం జ‌రిగేంత ఉద్రిక్త వాతావ‌ర‌ణం ఉండేద‌ని వివరించారు.  

ఇక ఈ అంశంపై పార్ల‌మెంటులో వివాద‌మేంటంటే.. రాహుల్ ఈ పుస్త‌కాన్ని కోట్ చేస్తూ.. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేశారు. అయితే ఇటు హోం మంత్రి అమిత్ షా, అటు ర‌క్ష‌ణ మంత్రి రాజ్ నాథ్   అభ్యంత‌రాలు చెప్పారు. మార్కెట్లోకి విడుద‌ల కాబోయే పుస్త‌కం గురించి దానిలోని అంశాల‌ను స‌భ‌లో ప్రస్తావించ‌రాద‌న్నది వారి అభ్యంతరం.   స‌భ‌లో ఒక మ్యాగ‌జైన్ లో వ‌చ్చిన స్టోరీని చూపిస్తూ మాట్లాడుతున్నారనీ, . దాని క‌స‌లు చ‌ట్ట‌బ‌ద్ధ‌త లేనే లేదనీ అన్నారు. ఎవరైనా సరే తమ  ఆత్మ‌క‌థ‌ రాసుకు నేట‌పుడు కొన్ని సంచలన విషయాలను అదే పనిగా, లేదా ఉద్దేశపూర్వకంగా పొందుపరుస్తారనీ, వాటిని సభలో చర్చకు పెట్టడం ఏంటనీసంచ‌ల‌న విష‌యాలు అదిప‌నిగా పొందుప‌రుస్తారు. అలాంటి వాటిని స‌భ‌లో ప్ర‌వేశ పెట్ట‌డ‌మేంటి? చ‌ర్చించ‌డ‌మేంట‌ని ప్రభుత్వం తరఫున వారు రాహుల్ నరవనె పుస్తకంలోని అంశాలను సభలో ప్రస్తావించడాన్ని తప్పుపట్టారు.

మొత్తంగా చూస్తే రాహుల్ నరవానె ఆత్మకథ  ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకంలోని అంశాలను సభలో లేవనెత్తడం ద్వారా కేంద్ర ప్రభుత్వం, ఆర్మీ మధ్య జరిగే సంభాషణలూ, నిర్ణయాధికారాల మధ్య సమన్వయం, విభేదాలకు సంబంధించిన అంశాలను సభలో చర్చకు తీసుకువచ్చింది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...