Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మావోయిస్టుల కంచుకోట కర్రెగుట్టలో డీజీపీ పర్యటన..!
posted on: Aug 10, 2026 4:30PM

ఒకప్పుడు మావోయిస్టు లకు కంచుకోటగా, సేఫ్ షెల్టర్ జోన్గా ఉన్న కర్రెగు ట్టలు ఇప్పుడు తెలంగాణ పోలీసుల పటిష్ట భద్రతలోకి వచ్చాయి. మావోయి స్టుల కార్యకలాపాలకు కీలక స్థావరంగా ఉన్న కర్రెగుట్టలను స్వాధీనం చేసుకోవడంలో తెలంగాణ పోలీసులు కీలక పాత్ర పోషించారని రాష్ట్ర డీజీపీ సీ వీ ఆనంద్ తెలిపారు. కర్రెగుట్టల్లో పర్యటించిన డీజీపీ అక్కడి పరిస్థితులను పరిశీలించడంతో పాటు జరుగుతున్న అభివృద్ధి పనులను స్వయంగా సమీక్షించారు. గతంలో కర్రెగుట్టలు మావోయిస్టులకు కీలకమైన ప్రాంతంగా ఉండేవని డీజీపీ పేర్కొన్నారు. దట్టమైన అటవీ ప్రాంతం, కొండలు, క్లిష్ట మైన భౌగోళిక పరిస్థితుల కారణంగా మావోయిస్టులకు ఈ ప్రాంతం సురక్షిత స్థావరంగా మారిందన్నారు. పోలీసుల కదలికలను ముందుగానే గుర్తించి తప్పించుకునేందుకు అనుకూలంగా ఉండటం తో కర్రెగుట్టలను మావోయిస్టులు సేఫ్ షెల్టర్ జోన్గా వినియోగించుకున్నారని తెలిపారు.
అలాంటి ప్రాంతాన్ని పోలీసులు సమర్థవంతమైన వ్యూహం తో తమ ఆధీనంలోకి తీసుకున్నారని చెప్పారు. కర్రెగుట్టలను స్వాధీనం చేసుకోవడంలో తెలంగాణ పోలీసు బలగాలు కీలక పాత్ర పోషించాయని డీజీపీ వివరించారు. కర్రెగుట్టలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న అనంతరం అక్కడ ప్రత్యేక పోలీసు దళాలను ఏర్పాటు చేసినట్లు డీజీపీ తెలిపారు. నిరంతరం భద్రతా పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు. గతంలో కర్రెగుట్టల్లోకి చేరుకోవాలంటే తీవ్రంగా శ్రమించాల్సి వచ్చేదని, ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని పేర్కొన్నారు. పోలీసుల నిరంతర నిఘా, భద్రతా చర్యలతో మావోయిస్టుల కార్యకలాపాలకు అడ్డుకట్ట పడిందన్నారు.
కర్రెగుట్టలను స్వాధీనం చేసుకున్న తర్వాత మావోయిస్టులపై ఒత్తిడి పెరిగి, పలువురు మావోయిస్టులు లొంగి పోయే పరిస్థితి ఏర్పడిం దని తెలిపారు. కర్రెగుట్టలో చేపడుతున్న అభివృద్ధి పనులను డీజీపీ స్వయం గా పరిశీలించారు. స్థానికంగా మౌలిక వస తుల అభివృద్ధి, రహదారులు, ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పన తదితర అంశాలపై అధికా రులతో చర్చించారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి తీసుకు రావాలని సూచించారు.
మావోయిస్టుల ప్రభావం నుంచి బయటపడిన కర్రెగుట్టలను భవిష్యత్తులో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని డీజీపీ తెలిపారు. కర్రెగుట్టల ప్రకృతి అందాలు, అటవీ ప్రాంతం, కొండ ప్రాంతా లను పర్యాటకులకు ఆకర్షణీయంగా మార్చే అవకాశాలను పరిశీలిస్తు న్నామని.డీజీపి చెప్పారు. భద్రతతో పాటు ప్రాంత అభివృద్ధి, పర్యాటక రంగం విస్తరణపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు.
టూరిజం అభివృద్ధి చెందితే స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఈ ప్రాంతానికి మరింత గుర్తింపు వస్తుందని అధికారులు భావిస్తున్నారు మొత్తంగా.. ఒకప్పుడు మావోయిస్టుల సేఫ్ షెల్టర్గా పేరొందిన కర్రెగుట్టలు ఇప్పుడు పోలీసుల భద్రతలోకి రావడంతో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాయి. భద్రత, మౌలిక వసతులు, పర్యాటక అభివృద్ధితో కర్రెగుట్టలకు కొత్త రూపు తీసుకురావడమే లక్ష్యం గా అధికారులు ముందు కు సాగుతున్నారు.
DGPs visit to Karregutta, DGP C.V. Anand, CM Revanth reddy, Telangana Police






