Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బడ్జెట్ ప్రతిపాదనలపై డిప్యూటీ సీఎం భట్టి కసరత్తులు
posted on: Mar 10, 2026 4:38PM

రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలపై డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ప్రీ–బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరై బడ్జెట్ ప్రతిపాదనలపై సమగ్రంగా చర్చించారు.ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రంలో కోట్లాది ప్రజలతో ప్రత్యక్ష సంబంధం కలిగిన శాఖలు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖలని పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, మహిళలు చిన్నారుల సంక్షేమం కోసం ఈ శాఖలకు బడ్జెట్లో ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు.గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని వారు తెలిపారు. ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం, అంగన్వాడీ కేంద్రాలు, మహిళా భవనాల నిర్మాణం వంటి అంశాలకు బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు చేయనున్నట్లు పేర్కొన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మెరుగైన సేవలు అందేలా అవసరమైన నిధులు సమకూర్చే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారం, సమగ్ర అభివృద్ధి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటున్న అంశాలని మంత్రులు స్పష్టం చేశారు. ముఖ్యంగా చిన్నారుల సంక్షేమం, పోషకాహార కార్యక్రమాల అమలుకు గత ఏడాది బడ్జెట్తో పోలిస్తే మరింత ఎక్కువ నిధులు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఇంటిగ్రేటెడ్ పాఠశాలలతో అనుబంధంగా కొత్త అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు. చిన్నారుల విద్య, పోషణ, సంరక్షణ ఒకే వేదికపై అందేలా ఈ కేంద్రాలను అభివృద్ధి చేయడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
అలాగే ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం కోతలు విధిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ లోటును భర్తీ చేసే దిశగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు తగ్గకుండా ఉండేలా రాష్ట్రం నుంచి అవసరమైన నిధులు కేటాయించి పథకం అమలు కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారత, చిన్నారుల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది అని పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆయా శాఖలకు బడ్జెట్ కేటాంపులుంటాయని మంత్రులు తెలిపారు.


.webp)
.webp)


