పంద్రాగస్టు వేడుకల ముంగిట ఢిల్లీలో కలకలం రేపిన బాంబు బెదరింపు.!

posted on: Aug 14, 2026 5:44PM

దేశ రాజధాని పంద్రాగస్టు వేడుకలకు సిద్ధమౌతున్న వేళ.. హస్తినలో కీలక ప్రాంతాలలో ఉగ్రదాడులకు బెదరింపులు రావడం కలకలం సృష్టించింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఒక రోజు ముందు అంటే శుక్రవారం (ఆగస్టు 14)  ఢిల్లీలోని   కీలక ప్రాంతాలకు బాంబు బెదిరింపు  రావడం సంచలనం సృష్టించింది. ఢిల్లీ హైకోర్టుతో పాటు,  ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికిబాంబు బెదరింపు ఈ మెయిల్స్ వచ్చాయి.   వెంటనే ఢిల్లీ పోలీసులు, సీఐఎస్ఎఫ్ బలగాలు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌లు,   డాగ్ స్క్వాడ్‌లు  రంగంలోకి దిగాయి. హైకోర్టు ప్రాంగణంతో పాటు విమానాశ్రయ టెర్మినల్స్, రన్‌వేలు, పార్కింగ్ ఏరియాలు,  చుట్టుపక్కల   ప్రాంతాల్లో   క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇప్పటికే ఢిల్లీ వ్యాప్తంగా   పోలీసులతో భారీ భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు.   ఎర్రకోట పరిసరాల్లో మల్టీ లేయర్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. పంద్రాగస్టు వేడుకల ముంగిన  ఈ ఈమెయిల్ బెదిరింపులు రావడంతో  భద్రత, నిఘా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేశారు.  ముందస్తు జాగ్రత్త చర్యగా అన్ని ప్రవేశ  నిష్క్రమణ మార్గాల్లో వాహనాలు, ప్రయాణీకుల తనిఖీలు చేపట్టారు.  

Delhi bomb threat, Delhi High Court bomb threat, IGIA bomb threat, Independence Day security alert, Delhi Police alert, August 15 security

google-ad-img
    Related Sigment News
    • Loading...