Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...డిల్లీలో కాల్పులు! ఉగ్రవాదుల పనేనా?
posted on: Feb 23, 2015 10:31AM
.jpg)
డిల్లీలో హోంశాఖకు చెందిన వాహనంపై గుర్తు తెలియని దుండగుడు ఈరోజు ఉదయం కాల్పులు జరిపినట్లు తాజా సమాచారం. రైల్వేకి చెందిన ఐ.ఆర్.సి.టి.సి. సంస్థ వాహనంలో వచ్చి కాల్పులు జరిపి వెంటనే పారిపోయినట్లు పోలీసులు కనుగొన్నారు. ఆ దాడిలో హోమ్ మంత్రిత్వ శాఖ వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. గత కొన్ని వారాలుగా డిల్లీ మరియు దేశంలో ఇతర నగరాలపై ఉగ్రవాదులు దాడులు చేయవచ్చని ఇంటలిజన్స్ శాఖ పదేపదే హెచ్చరిస్తున్నందున ఇది ఉగ్రవాదుల పనేనా లేకపోతే వేరే ఇతర కారణాలున్నాయా అనే సంగతి పోలీసుల దర్యాప్తులో తేలవలసి ఉంది. ఒకవేళ గాయపడిన డ్రైవర్ కి ఇతరులెవరితో వ్యక్తిగత ద్వేషాలు, గొడవలున్నప్పటికీ, ఆ కారణంగా హోమ్ మంత్రిత్వ శాఖకు చెందిన వాహనం నడుపుతున్న సమయంలో అతనిపై కాల్పులు జరిపే సాహసం ఎవరూ చేయబోరు కనుక ఇది ఉగ్రవాదుల పనే అయి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కాల్పులలో గాయపడి, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకొంటున్న డ్రైవర్ ని కూడా పోలీసులు ప్రశ్నించి అతనిని నుండి సమాధానాలు రాబడితే ఈ దాడికి పాల్పడింది ఎవరనే సంగతి బయటపడవచ్చును. లేదా ఈ కాల్పులు జరిపిన వ్యక్తిని పట్టుకొంటే తప్ప పరిస్థితి తీవ్రత అర్ధం చేసుకోలేము. నేటి నుండి పార్లమెంటు సమావేశాలు మొదలవుతున్న తరుణంలో డిల్లీలో కాల్పులు జరగడంతో డిల్లీ పోలీసులు చాలా ఆందోళనకు గురయి ఉండవచ్చును.


.jpg)



