Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...200 కోట్ల ఆస్తులు.. విల్లాలు.. పామ్ హౌస్లు.." అంటూ యువతులను మోసం చేసిన మోసగాడు
posted on: Jun 10, 2026 9:30PM

హైదరాబాద్లో వెలుగులోకి వచ్చిన వెంకట కామేష్ వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. బయటకు చూస్తే కోటీశ్వరుడు.. మాటల్లో చూస్తే పెద్ద వ్యాపారవేత్త.. కానీ వాస్తవానికి మాత్రం మ్యాట్రిమోని సైట్లను అడ్డాగా చేసుకుని యువతులను మోసం చేసిన కేటుగాడిగా పోలీసులు గుర్తించారు.దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ వెంకట కామేష్ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి 18 కేసులు నమోదవగా, బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ రంగంలో పనిచేసే యువతులే అతని మోసానికి ఎక్కువగా బలైనట్లు విచారణలో తేలింది.
ప్రముఖ మ్యాట్రిమోని వెబ్సైట్లలో తనను రూ.200 కోట్ల ఆస్తులున్న వ్యక్తిగా పరిచయం చేసుకునే కామేష్. విల్లాలు, వ్యవసాయ భూములు, పామ్ హౌస్లు, భారీ వ్యాపారాలు ఉన్నట్లు ప్రొఫైళ్లలో పేర్కొని యువతులను ఆకర్షించేవాడు. ఉన్నత వర్గాలకు చెందిన మ్యాట్రిమోని సైట్లలో అదే సామాజిక, ఆర్థిక వర్గానికి చెందిన వ్యక్తిగా రిజిస్ట్రేషన్ చేసుకుని నమ్మకం సంపాదించేవాడని పోలీసులు చెబుతున్నారు.
మొదట స్నేహం, ఆ తర్వాత ప్రేమ, చివరికి పెళ్లి హామీ.. ఇదే కామేష్ అనుసరించిన వ్యూహంగా పోలీసులు గుర్తించారు. యువతులతో సన్నిహితంగా మెలిగిన తర్వాత వ్యాపార అవసరాలు, అత్యవసర పరిస్థితులు, పెట్టుబడుల పేరుతో లక్షల రూపాయలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పెళ్లి మాట నమ్మి కొందరు యువతులు భారీ మొత్తాలు ఇచ్చినట్లు సమాచారం.బాధితుల నుంచి సేకరించిన డబ్బును వ్యాపారాల్లో పెట్టకుండా ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్లలో ఖర్చు చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. లక్షల్లో వచ్చిన డబ్బును జూదం తరహా కార్యకలాపాల్లో పోగొట్టుకు న్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే కామేష్పై ఆరు కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో యువతి ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కొత్తగా మరో కేసు నమోదు కావడంతో బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల అతడిని అరెస్టు చేసిన పోలీసులు, మచిలీపట్నంలో నమోదైన మరో కేసు దర్యాప్తు కోసం పీటీ వారెంట్పై కస్టడీకి తీసుకున్నారు. అతని బ్యాంకు లావాదేవీలు, మ్యాట్రిమోని ఖాతాలు, ఫోన్ డేటాను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. "పెళ్లి పేరుతో నమ్మకం... కోటీశ్వరుడి ముసుగులో మోసం... మ్యాట్రిమోని సైట్లను ఆయుధంగా మార్చుకున్న వెంకట కామేష్ వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది.


.webp)
.webp)


