Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పాలు తాగడం ఆరోగ్యానికి మంచిదే.. కానీ నయం చేయలేని ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఉందట!
posted on: Apr 16, 2026 2:59PM

భారతీయుల ఆహారంలో పాలు, పాల ఉత్పత్తులకు చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి లేకుండా రోజు అస్సలు గడవదు. ఇక ఇప్పట్లో చాలా మంది పనీర్ కుడా బాగా వినియోగిస్తున్నారు. అయితే.. పాలు తాగడం ఆరోగ్యానికి మంచిదే అయినా.. పాలు తాగడం వల్ల నయం చేయలేని పార్కిన్సన్స్ వ్యాధికూడా వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. పాలకు, పాల ఉత్పత్తులకు, పార్కిన్సన్స్ వ్యాధి రావడానికి అసలు సంబంధం ఏంటి? వైద్యులు దీని గురించి ఏం చెబుతున్నారు? పూర్తీగా తెలుసుకుంటే..
పాలు, పార్కిన్సన్స్ వ్యాధి..
పాల ఉత్పత్తులు.. ముఖ్యంగా పాలు తీసుకునే వారికి పార్కిన్సన్స్ వ్యాధి వచ్చే ప్రమాదం కొద్దిగా ఎక్కువగా ఉండవచ్చని చాలా అధ్యయనాలు వెల్లడించాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రమాదం, ముఖ్యంగా పురుషులలో, 20 నుండి 40 శాతం వరకు ఎక్కువగా ఉన్నట్లు కనుగొనబడింది. అయితే.. ఇది వ్యాధికి ప్రత్యక్ష కారణం కాదు, కేవలం ఒక సహసంబంధం మాత్రమే. దీనిని ఇంకా పూర్తిగా అర్థం చేసుకోవాల్సి ఉందని వైద్యులు అంటున్నారు.
పరిశోధనలు చెప్పింది ఇదే..
సుమారు 25 సంవత్సరాల పాటు ప్రజల ఆహారపు అలవాట్లను పరిశీలించిన తర్వాత, చాలా తక్కువ పాలను తీసుకునే వారితో పోలిస్తే, ప్రతిరోజూ మూడు లేదా అంతకంటే ఎక్కువ సార్లు తక్కువ కొవ్వు ఉన్న పాలను తీసుకునే వారికి పార్కిన్సన్స్ వ్యాధి వచ్చే ప్రమాదం 34 శాతం ఎక్కువగా ఉందని పరిశోధనలలో కనుగొనబడింది. అలాగే పాలు తాగడం వల్ల పురుషులలో పార్కిన్సన్స్ ప్రమాదం 1.8 రెట్లు, మహిళలలో 1.3 రెట్లు పెరుగుతుందని మరొక అధ్యయనం కూడా చెబుతోంది.
పాలతో ఎందుకు సమస్య అవుతోంది..
కొన్ని పరిశోధనల ప్రకారం, పాలలో ఉండే హెప్టాక్లోర్ ఎపాక్సైడ్ వంటి పురుగుమందుల అవశేషాలు మెదడుకు హానికరంగా ఉండవచ్చు. పాలలో ఉండే గెలాక్టోజ్ కూడా ఒక కారకమని, దీనిని అధిక పరిమాణంలో తీసుకున్నప్పుడు మెదడుపై ప్రభావం చూపుతుందని నమ్ముతారు. మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. పాల ఉత్పత్తులు మన పేగు మైక్రోబయోమ్ను ప్రభావితం చేసి, కొన్ని ప్రోటీన్ల ఉత్పత్తికి దారితీస్తాయని, తరువాత మెదడుకు చేరి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయని చెబుతున్నారు.
పాలు తాగడం మానేయాలా?
వెంటనే పాలు లేదా పాల ఉత్పత్తులను మానేయాలని చెప్పడం దీని ఉద్దేశ్యం కాదు. మితంగా తీసుకోవడం చాలా అవసరమని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఎక్కువగా పాలు, ముఖ్యంగా తక్కువ కొవ్వు లేదా మీగడ తీసిన పాలు తీసుకుంటే, వాటిని కొద్దిగా తగ్గించడం మంచిది.
పార్కిన్సన్స్ వ్యాధి లక్షణాలు..
భారతదేశంలో పార్కిన్సన్ వ్యాధి కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. చేతులు వణకడం, కండరాలు బిగుసుకుపోవడం, కదలికలు మందగించడం, శరీర భంగిమ దెబ్బతినడం వంటివి దీని లక్షణాలు. మలబద్ధకం, వాసన కోల్పోవడం, నిద్రలేమి, మానసిక స్థితిలో మార్పులు వంటివి మొదటి దశలో కనిపించే లక్షణాలు. ఈ వ్యాధిని పూర్తిగా నివారించడం సాధ్యం కాదని వైద్యులు భావిస్తున్నారు, కానీ ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ద్వారా ప్రమాదాన్ని ఖచ్చితంగా తగ్గించవచ్చు.
*రూపశ్రీ.






