Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మాజీ మంత్రి అనుచరుల భూ దందా.. చంపేస్తామంటూ బెదిరింపులు..!
posted on: Aug 12, 2026 10:20AM

చంపేస్తే బెయిల్ వస్తుంది.. వైసీపీ నేత వీడియో వైరల్..!
కాకినాడ జిల్లాలో అధికార మార్పిడి జరిగినప్పటికీ భూ ఆక్రమణలు, బెదిరింపుల పర్వం కొనసాగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అనుచరులు ఓ భూ వివాదంలో ఏకంగా మాజీ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిని, ప్రముఖ వైద్యుడిని హత్య చేస్తామంటూ తీవ్ర బెదిరింపులకు దిగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
బాధితుడి కథనం ప్రకారం.. తునికి చెందిన ప్రముఖ వైద్యుడు, జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు డాక్టర్ చిలుకోటి పాండురంగారావు కుటుంబానికి తొండంగి మండలంలో 3.53 ఎకరాల భూమి ఉంది. ఆయన మామ సుమారు 17 ఏళ్ల క్రితం పెద్దిరెడ్డి కొండలరావు నుంచి ఈ స్థలాన్ని చట్టబద్ధంగా కొనుగోలు చేశారు. అయితే, ఆ భూమిపై కన్నువేసిన కొండలరావు కుమారుడు, వైసీపీ నేత పెద్దిరెడ్డి సురేష్ పదేళ్ల తర్వాత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ఈ స్థలం వివాదంపై విచారణ జరిపిన పిఠాపురం న్యాయస్థానం ఈ ఏడాది జనవరిలో సురేష్ పిటిషన్ను కొట్టివేస్తూ, భూమి హక్కులు డాక్టర్ పాండురంగారావు కుటుంబానివేనని స్పష్టం చేసింది. కోర్టు తీర్పు అనంతరం బాధితులు తమ స్థలంలో పనులు ప్రారంభించేందుకు ప్రతినిధులను పంపగా, మాజీ సర్పంచ్ సురేష్ అనుచరుడు దేవులపల్లి శ్రీనుతో పాటు మరో ఎనిమిది మంది దౌర్జన్యానికి దిగారు.
బాధితుల ప్రతినిధులను అడ్డుకున్న దేవులపల్లి శ్రీను, డాక్టర్ను లేపేస్తామని, హత్య చేసినా తమకు మూడేళ్లకు మించి జైలు శిక్ష పడదని అత్యంత నిర్లక్ష్యంగా వ్యాఖ్యానించారు. తనకు 40 ఏళ్లుగా కేసులతో అనుభవం ఉందని, సులభంగా బెయిల్ తెచ్చుకుంటామని బెదిరించారు. ఈ దౌర్జన్యానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
ఈ ఘటనపై బాధితులు గత నెలలోనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు వీడియో ఆధారాలను పెన్డ్రైవ్ ద్వారా అందించినప్పటికీ, అధికారులు వెంటనే చర్యలు తీసుకోలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీడియో నెట్టింట తీవ్ర కలకలం రేపడం, బాధితుల నుంచి ఒత్తిడి పెరగడంతో ఎట్టకేలకు పోలీసులు స్పందించి కేసు నమోదు చేశారు.
మాజీ సర్పంచ్ పెద్దిరెడ్డి సురేష్, దేవులపల్లి శ్రీను, కాలిన బాబ్జితో పాటు మరొక ఎనిమిది మందిపై అక్రమంగా ప్రవేశించడం, ప్రాణబెదిరింపులకు దిగడం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద పోలీసులు కేసు బుక్ చేశారు. బాధితుల తరఫు న్యాయవాది నుంచి ఫిర్యాదు అందుకోవడంతోనే విచారణ వేగవంతం చేసి కేసు నమోదు చేశామని పోలీసులు స్పష్టం చేశారు.
మాజీ మంత్రి ప్రధాన అనుచరులే బహిరంగంగా హత్య బెదిరింపులకు దిగడం పట్ల విపక్షాలు, ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్న ఇటువంటి అరాచక శక్తులపై కఠినంగా వ్యవహరించకపోతే సాధారణ ప్రజలకు ఆస్తుల రక్షణ ఉండదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
కోర్టు తీర్పులను సైతం ఖాతరు చేయకుండా భూకబ్జాలకు పాల్పడుతున్న వైకాపా నాయకులపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేసి, బాధితులకు పూర్తి రక్షణ కల్పిస్తారా లేదా అనేది వేచి చూడాలి.
Dadishetti Raja, Kakinada land dispute, Devulapalli Srinu, Tondangi land dispute, YSRCP leaders anarchy



.webp)


