కొత్త జిల్లాల ఏర్పాటుకు ఏపీ క్యాబినెట్‌ గ్రీన్ సిగ్నల్

 

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు  అధ్యక్షతన జరిగిన ఈ  క్యాబినెట్‌ సమావేశంలో జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో జిల్లాల సంఖ్య 28కి చేరింది. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని మదనపల్లెకి మార్చింది. 

రాయచోటిని మదనపల్లె జిల్లాకు, రైల్వేకోడూరును తిరుపతి జిల్లాకు, రాజంపేటను కడప జిల్లాకు, గూడూరును తిరుపతి జిల్లా నుంచి నెల్లూరుకు మార్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి ఎల్లుండి తుది గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల కానుంది.  మరోవైపు కొత్తగా 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu