కమ్యూనిస్టుల జాతీయ హోదా మటాష్

posted on: May 19, 2014 11:48AM

 

ఈ ఎన్నికలలో వీచిన మోడీ ప్రభంజనం కాంగ్రెస్ పార్టీతోపాటు అనేక పార్టీల గాలి తీసిపారేసింది. ముఖ్యంగా కమ్యూనిస్టులని అధ: పాతాళానికి తోసేసింది. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో జుట్టూ జుట్టూ పట్టుకుని కొట్టుకుంటున్న ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఈ ఎన్నికల తర్వాత ఉభయ భ్రష్టత్వం పొందాయి. ఈ పార్టీలు నిలబెట్టిన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఓడిపోయారు. దాంతో లోక్ సభలో ఈ పార్టీల బలం పూర్తిగా తగ్గిపోయింది. అందువల్ల సీపీఐ, సీపీఎం పార్టీలకు వున్న జాతీయ పార్టీల హోదా మటాషైపోయింది. ఏ పార్టీ అయినా జాతీయ హోదా పొందాలంటే ఎన్ని ఎంపీ స్థానాలు సాధించాలో అన్ని స్థానాలు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు సాధించలేకపోవడంతో ఈ రెండు పార్టీలకు జాతీయ హోదా గుర్తింపును రద్దు చేస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. దీంతో సీపీఐ, సీపీఎం పార్టీల పరిస్థితి మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా తయారైంది. ఇంత జరిగినా రాష్ట్రంలో ఈ రెండు పార్టీల వారికి జ్ఞానోదయం కలిగినట్టుగా లేదు. సీపీఎం నేతలు లంచాలు తీసకున్నారని సీపీఐ నేతలు, సీపీఐ నేతలు ఎక్కువగా మాట్లాడుతున్నారని సీపీఎం నేతలు తిట్టుకుంటూ వున్నారు. అయ్యా.. మీరు ఇలా తిట్టుకుంటూనే వుండండి. మిమ్మల్ని వదిలి ఈ దేశం ముందుకు వెళ్ళిపోతుంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...