రిటైర్డ్ ఆర్మీ జవాన్ ధైర్యాన్ని ప్రశంసించిన సీపీ సజ్జనార్

posted on: Apr 16, 2026 9:10PM

 

హైదరాబాద్‌లో ఓ రిటైర్డ్ సైనికుడి ధైర్యసాహసం చైన్ స్నాచర్‌ను పోలీసులకు పట్టించింది. ఈరోజు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్వయంగా ధైర్య సాహసాలు ప్రదర్శించిన రిటైర్డ్ ఆర్మీ జవాన్ చీర్ల రాముడిని సన్మానించారు. బషీర్‌బాగ్‌లోని పాత కమిషనరేట్ కార్యాలయంలో గురువారం ఆయనను ఆహ్వానించి శాలువా కప్పి నగదు బహుమతిని అందజేశారు. ఈ ఘటన ఈ నెల 14న అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబర్‌పేట్ ఇరానీ హోటల్ బస్టాప్ వద్ద జరిగింది. 

బస్సు దిగుతున్న రాముడి మెడలోని బంగారు గొలుసును అపహరించేందుకు నిందితుడు అకస్మాత్తుగా ప్రయత్నించగా, తన వయసును కూడా లెక్కచేయ కుండా రాముడు  ఒక్క క్షణం కూడా వెనుకాడకుండా నిందితుడిని గట్టిగా పట్టుకుని డయల్ 100కు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే అంబర్‌పేట్ పెట్రోల్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు మల్లేపల్లికి చెందిన ఆటో డ్రైవర్ అబ్దుల్  మన్నన్ గా గుర్తించారు.  

ఇతనిపై తెలంగాణ వ్యాప్తంగా 31 పాత కేసులు ఉన్నట్టు బయటపడింది. హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో సస్పెక్ట్ షీట్ ఉండగా, మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ కేసులో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడు.అతని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు., అతని అనుచరులు కోటేష్ మరియు మల్లేష్ పరారీలో ఉన్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ “సైనికుడు ఎప్పుడూ సైనికుడే” అన్న మాటను రాముడు తన కార్యాచరణతో నిజం చేశారని పేర్కొన్నారు. భయాన్ని జయించి నేరస్తుడిని ఎదిరించిన ఆయన ధైర్యం సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు. ప్రతి పౌరుడు యూనిఫామ్ లేని పోలీస్‌లా వ్యవహరిస్తే నేరాలను నియంత్రించడం సులభమవు తుందని పిలుపునిచ్చారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...