కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మృతి..
posted on: Jun 9, 2017 10:58AM

కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మృతి చెందారు. సిమ్లాలో ఉన్న ఆయన హఠాత్తుగా గుండోపోటుకు గురవ్వడంతో వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే మృతి చెందారు. 1967లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనా పాల్వాయి.. ఐదుసార్లు ఎమ్మెల్యేగా కొనసాగారు. కాగా ప్రస్తుతం పాల్వాయి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. తెలంగాణ నుండి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Latest YouTube Trending Video NEWS






