వెళ్లి పోరాడకుండా మెసేజులు ఎందుకు? పవన్ కళ్యాణ్ కి వి.హెచ్. ప్రశ్న

posted on: Aug 21, 2015 9:58PM

 

ఏపీ రాజధాని భూసేకరణ విషయంలో తెలంగాణాకు చెందిన రాజ్యసభ సభ్యుడు వి. హనుమంత రావుకి ఎటువంటి సంబందమూ లేదు. కానీ దాని గురించి పవన్ కళ్యాణ్ చేస్తున్న ట్వీట్ మెసేజులు చూసి ఆయన కూడా విసిగిపోయినట్లున్నారు. అందుకే ఆయన “ఇంట్లో కూర్చొని ట్వీట్ మెసేజులు పెట్టడం కాదు. తుళ్ళూరు వెళ్లి రైతుల తరపున నిలబడి పోరాడు. ఇటువంటి సమయంలో కూడా పోరాడకపోతే ఇంకెప్పుడు పోరాడుతావు?” అని పవన్ కళ్యాణ్ న్ని వి.హెచ్. ప్రశ్నించారు. ఇంతవరకు తెదేపా మంత్రులతోనే పవన్ కళ్యాణ్ యుద్ధం చేస్తున్నారు. ఇప్పుడు వారికి వి.హెచ్. కూడా తోడయ్యారు. ఆయన ప్రశ్నలకి పవన్ కళ్యాణ్ తప్పక జవాబు చెప్పవచ్చును. ఎందుకంటే క్రిందటి సారి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు, తనపై విహెచ్ చేసిన విమర్శల గురించి కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...