కాంగ్రెస్ ఆత్రపడితే జీ.హెచ్.యం.సి. ఎన్నికలు వస్తాయా?
posted on: Sep 16, 2014 7:57PM
.jpg)
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ త్వరలో జరగనున్న జీ.హెచ్.యం.సి. ఎన్నికలకు సిద్దం అయ్యే ప్రయత్నంలో నిన్న హైదరాబాదులో సమావేశమయ్యి ఆ పరిధిలో స్థిరపడిన సెటిలర్స్ ను ప్రసన్నం చేసుకొనే ప్రయత్నంలో వారి భద్రతకు తాము భరోసా ఇస్తున్నామంటూ ఏవో చాలా మాటలే చెప్పారు. అయితే జీ.హెచ్.యం.సి. కౌన్సిల్ ప్రస్తుత కాలపరిమితి డిశంబరులో ముగుస్తుంది. ఆ తరువాత జీ.హెచ్.యం.సి. పరిధిలో వార్డులను జనాభా ప్రాతిపదికన పునర్వ్యవస్థీకరణ చేసి, ఆయా వార్డులలో బీసీ, యస్సీ, యస్టీ వర్గాలకు కేటాయింపులు చేయవలసి ఉంటుంది. కనుక ఆ ప్రక్రియ అంతా పూర్తీ చేసేవరకు జీ.హెచ్.యం.సి. ఎన్నికలు నిర్వహించే ఆలోచన ప్రభుత్వానికి లేదని రవాణా శాఖామంత్రి పీ. మహేందర్ రెడ్డి స్పష్టంగా ప్రకటించారు. కానీ ఈ విషయాన్ని పట్టించుకోకుండా టీ-కాంగ్రెస్ జీ.హెచ్.యం.సి. ఎన్నికలకు అప్పుడే సమర శంఖం పూరించేసారు. అంతేగాక ఈ సారి సెట్టిలర్లను ప్రసన్నం చేసుకొని ఈ ఎన్నికలలో గట్టెక్కాలని ఒక ప్రణాళిక కూడా సిద్దం చేసుకొన్నట్లున్నారు. కానీ కాంగ్రెస్ నేతలు ఎంతగా ఆత్రం పడినప్పటికీ ఇప్పట్లో జీ.హెచ్.యం.సి. ఎన్నికలు జరిగే అవకాశం లేదని మంత్రిగారి ప్రకటన స్పష్టం చేస్తోంది.



.jpg)
.jpg)

.webp)



