బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పై ఫిర్యాదు
posted on Nov 5, 2025 9:12AM
.webp)
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో మైనర్లను సైతం ప్రచారం లో వాడారంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుపై ఫిర్యాదు నమోదైంది. యూసుఫ్ గూడా కు చెందిన షఫీయుద్దీన్ అనే ఈ ఫిర్యాదు చేశారు. ఎన్నికల సంఘం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘించి ఎన్నికల ప్రచారంలో మైనారిటీ తీరని పిల్లలతో ఎన్నికల ప్రచారం చేయించారంటూ కేటీఆర్ పై షఫీయుద్దీన్ ఫిర్యాదు చేశారు.
ఈ నెల 2న బంజారాహిల్స్ లోని తెలంగాణ భవన్ లో కేటీఆర్ నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా, ఒక మైనర్ బాలిక ను వేదికపై తీసుకువచ్చి రాజకీయ ప్రేరేపిత , భావోద్వేగ ప్రకటన చేయించారనీ, తద్వారా ఓటర్లలో సానుభూతిని ప్రేరేపించడానికి, ప్రభావితం చేయడానికి ప్రయత్నించారనీ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. మైలేజ్ ల కోసం మైనారిటీ తీరన పిల్లలను ప్రచార సభలకు తీసుకువస్తున్నారంటూ షపీవుద్దీన్ అనే వ్యక్తి రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు చేసి తక్షణమే చర్యలు తీసు కోవాలని కోరారు.