భారీగా పెరిగిన కమర్షియల్ గ్యాస్ ధర.. సిలెండర్ పై రూ.993 రూపాయలు

posted on: May 1, 2026 12:50PM

దేశీయంగా చమురు విక్రయ సంస్థలు వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్‌పీజీ  సిలిండర్ల ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెంపు శుక్రవారం (మే1) నుంచే అమల్లోకి వచ్చాయి. తాజా పెంపు ప్రకారం, 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరపై ఏకంగా రూ. 993 మేర పెరిగింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలైన హైదరాబాద్, ఢిల్లీ, ముంబైలలో కమర్షియల్ సిలిండర్ ధర ఇప్పుడు 3వేల రూపాయలు దాటింది.  హోటళ్లు, రెస్టారెంట్లు,  చిరు వ్యాపారులపై ఈ పెరిగిన భారం నేరుగా పడుతోంది.  

2026 జనవరి 1 నుంచి ఇప్పటివరకు వాణిజ్య సిలిండర్‌‌‌‌‌‌‌‌ ధరలు పెరగడం ఇది ఆరో సారి కావడం గమనార్హం. తాజా పెంపుతో హోటళ్లు, రెస్టారెంట్లు, పరిశ్రమలపై తీవ్ర ప్రభావం పడనుంది. అయితే గృహ అవసరాలకు వాడే సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు చేయకపోవడం సామాన్యులకు కొంత ఊరట కలిగించే అంశం.  వాణిజ్య గ్యాస్ ధరల పెంపు ప్రభావం రానున్న రోజుల్లో ఆహార రంగంపై పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులుచెబుతున్నారు. పెరిగిన సిలిండర్ ధరల వల్ల హోటల్ లో సరుకుల ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.   

google-ad-img
    Related Sigment News
    • Loading...