Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వర్షాలు పడొద్దని అఘోర పూజలు చేశారు : సీఎం రేవంత్ రెడ్డి
posted on: Aug 13, 2026 7:48PM
.webp)
ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ శంకుస్థాపనలో ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు..!
హైదరాబాద్లోని కేబీహెచ్బీ కాలనీలో సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేమాట్లాడుతూ.. ఆనాడు నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసినప్పుడు కూకట్పల్లి ప్రజలు నన్ను ఆశీర్వదించి గల్లీ నుంచి ఢిల్లీకి పంపించారు. అయితే ప్రతిపక్షంలో ఉన్న సమయంలో గత ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో.. మీరు ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయాని తెలిపారు.
కానీ ఇప్పుడు కూకట్పల్లిని అభివృద్ధి చేసేందుకు అన్ని రకాల అధికారాలు, అవకాశాలు మా ప్రభుత్వానికి ఉన్నాయి. మీకు ఎలాంటి అభివృద్ధి కావాలన్నా అడిగి చేయించుకోండి. కూకట్పల్లి నియోజకవర్గాన్ని ప్రత్యేక దృష్టితో అభివృద్ధి చేయాలని మంత్రి శ్రీధర్బాబును ఆదేశిస్తున్నాని సీఎం స్పష్టం చేశారు.
పదేళ్ల వారి పాలనను.. రెండేళ్ల మా పాలనను బేరీజు వేసుకోండి. తెలంగాణలో 3 కోట్ల 28 లక్షల మందికి సన్నబియ్యం అందిస్తున్నాం. ప్రతి పేద కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని
ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని పెంచేలా ఇందిరమ్మ చీరలను సారెగా అందించాం. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. స్వయం సహాయక సంఘాలకు రూ.65 వేల కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందించామని రేవంత్ రెడ్డి తెలిపారు.
కడుపులో విషం పెట్టుకుని కొందరు ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టి ప్రభుత్వంపైకి ఉసిగొల్పినా.. మా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఆడబిడ్డలను బస్సులకు యజమానులను చేశాం. పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేలా మహిళా సంఘాలను ప్రోత్సహించాం. స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులను విక్రయించుకునేందుకు శిల్పారామంలో స్టాళ్లు ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి వెల్లడించారు.
ఒకవైపు గత ప్రభుత్వం చేసిన అప్పులను చెల్లించుకుంటూనే.. మరోవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. డబ్బా ఇండ్లు వద్దు.. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని చెప్పిన గత ప్రభుత్వం.. మీలో ఒక్కరికైనా ఇల్లు ఇచ్చిందా?పట్టణ ప్రాంతాల్లో పేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలనే లక్ష్యంతో మా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు టవర్స్కు శ్రీకారం చుట్టింది. మొదటి విడతలో లక్ష ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మీ సొంతింటి కలను నిజం చేసేందుకు మీ సోదరుడిగా మీకు అండగా ఉంటాను. మీ సొంత భూములు కోల్పోకుండా చూసే బాధ్యత మాదే. ఈ విషయంలో మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం భరోసానిచ్చారు.సోషల్ మీడియాలో కొందరు చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని నమ్మొద్దు. పదేళ్ల వారి పాలనను.. రెండేళ్ల మీ తమ్ముడి పాలనను బేరీజు వేసుకోండి.
నాకు వయసు ఉంది.. ఓపిక ఉంది.. మీకు మంచి చేయాలన్న సంకల్పం ఉంది. తెలంగాణను విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్తున్నాం.కొంతమంది దుర్మార్గులు రాష్ట్రంలో కరువు రావాలని క్షుద్ర పూజలు చేశారు. అయినా దేవుడు మన వైపు ఉన్నాడు.. వర్షాలు కురిపించాడు. మంచి మనసుతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న మా సంకల్పానికి దేవుడి ఆశీర్వాదం ఉంది.కుటిల బుద్ధితో క్షుద్ర పూజలు చేసే వారికి.. ఆ కుట్రలే తిరిగి వారినే అష్టదిగ్బంధనం చేస్తాయి. మీరు అండగా ఉండండి.. తెలంగాణను మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.
CM Revanth Reddy, Indiramma Indlu Towers, Indiramma Housing Scheme, Kukatpally Development,Telangana Government, Double Bedroom Houses,Telangana Politics


.webp)



