కేసీఆర్‌కు ఏమైంది..ఢిల్లీలో సీఎంకు సర్జరీ

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ గత కొద్ది రోజులుగా మీడియాకు కనిపించడం లేదు..సచివాలయానికి వచ్చిన దాఖలాలు లేవు..ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ నామినేషన్ సందర్భంగా ఢిల్లీ వెళ్లిన కేసీఆర్..కార్యక్రమం ముగిసినా హైదరాబాద్ రాలేదు. దీంతో ఏమైందా అని ఆరా తీయగా సీఎం సర్జరీ చేయించుకోబోతున్నారట. కుడి కంటిలో చిన్న పొర ఏర్పడటంతో కేసీఆర్ గతంలోనే ఆపరేషన్ చేయించుకోవాలని అనుకున్నారు. అయితే మందులతోనే పొరను తొలగించేందుకు డాక్టర్లు ప్రయత్నించారు. అయితే ఎలాంటి ఫలితం లేకపోవడంతో వైద్యులు ఆపరేషన్ చేయాల్సిందేనని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి డాక్టర్ సచ్‌దేవ్ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా పరీక్షలు నిర్వహించారు. శస్త్ర చికిత్స అనంతరం నాలుగు రోజుల పాటు ఢిల్లీలోనే విశ్రాంతి తీసుకుని తిరిగి హైదరాబాద్‌కు తిరిగి వస్తారు.