విశాఖలో గూగుల్ సంస్థ భారీ పెట్టుబడులు : సీఎం చంద్రబాబు

 

హైదరాబాద్‌లో కేవలం 14 నెలల్లోనే హైటెక్ సిటీని నిర్మించానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అమరావతిలోని విట్  విశ్వవిద్యాలయంలో నేడు జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.  ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు తమ ప్రతిభతో ఉన్నత స్థానాల్లో ఉంటున్నారని  కొనియాడారు. ఈ సందర్భంగా విట్-ఏపీ క్యాంపస్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం, నూతన స్టార్టప్ ఆలోచనలకు ఊతమిచ్చేందుకు ఏర్పాటు చేసిన వి-లాంచ్‌ ప్యాడ్ 2025 ఇంక్యుబేషన్ సెంటర్‌ను లాంఛనంగా ఆవిష్కరించారు. విద్యార్థులనుద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ, విట్-ఏపీలో 95 శాతం మంది విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్ల ద్వారా ఉద్యోగాలు సాధించడం అభినందనీయమన్నారు. భవిష్యత్ అంతా ఐటీ దేనని అప్పట్లోనే చెప్పాను దేశంలోని ఐఐటీలలో 20 శాతం సీట్లు తెలుగోళ్లే కొల్లగొడుతున్నారు. అన్నింటిలో తెలుగువారు ముందుండాలనేదే నా ఆకాంక్ష అని తెలిపారు.ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులుంటారు.. అందులో అగ్రస్థానంలో తెలుగువారు ఉంటారని పేర్కొన్నారు. 

మే 2 ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమరావతికి వస్తున్నారు. ప్రధాని చేతుల మీదుగా అమరావతి పున:ప్రారంభం కాబోతుందని.. అప్పట్లో ఐటీని ప్రమోట్ చేశానని.. ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్నానని తెలిపారు. ఒకప్పుడు ప్రభుత్వ అటెండర్ ఉద్యోగానికి కూడా డిమాండ్ ఉండేది. ఒకప్పుడు ప్రభుత్వ అటెండర్‌ ఉద్యోగానికి కూడా డిమాండ్‌ ఉండేది. ఇప్పుడు కలెక్టర్‌ పోస్టు కంటే ఐటీ ఉద్యోగానికే డిమాండ్‌ ఎక్కువగా ఉందన్నారు. విట్‌ అమరావతిలో 95 శాతం ప్లేస్‌మెంట్లు వస్తున్నాయి. మీరు ఉద్యోగంలో సంతృప్తి చెందవద్దు.. కొత్త సంస్థలు స్థాపించండి. సిలికాన్‌ వ్యాలీలో కంపెనీల సీఈవోలంతా తెలుగోళ్లు, భారతీయులే. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులు ఉంటారు. అందులో అగ్రస్థానంలో తెలుగువారు ఉంటారు. త్వరలో అమరావతిలో రతన్‌టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ఏర్పాటు చేస్తున్నాం. మన పిల్లలు ప్రపంచస్థాయి సేవలు అందించే స్థాయికి ఎదగాలి. వాట్సప్‌ సేవ ద్వారా ప్రజలకు పరిపాలన, ప్రభుత్వ సర్వీసులు దగ్గర చేశాం. వాట్సప్‌ ద్వారా వెయ్యి రకాల సేవలు అందిస్తున్నాం. స్వర్ణాంధ్రప్రదేశ్‌ 2047కి మార్గసూచి రూపొందిస్తున్నాం. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగింది. ఇప్పుడు కలెక్టర్ పోస్ట కంటే ఐటీ ఉద్యోగానికి డిమాండ్ ఎక్కువగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో విట్ యూనివర్సిటీ ఛాన్స్‌లర్ డాక్టర్ జి. విశ్వనాథన్, వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ ఎస్.వి. కోటారెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.