ఢిల్లీలో 16 మెట్రో స్టేషన్ల మూత.. సుప్రీం సీరియస్.!

posted on: Jul 23, 2026 2:23PM

ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు రోజు రోజుకూ ఉధృతమౌతున్నాయి.  బుధవారం (జులై 22)  నిరసనకారులు, పోలీసుల మధ్య తీవ్ర తోపులాటలు, ఘర్షణలు చోటుచేసుకో వడంతో జంతర్ మంతర్, కన్నాట్ ప్లేస్ పరిసర ప్రాంతాలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి,  నిరసనకారులను చెదర గొట్టేందుకు పోలీసులు భారీగా మోహరించగా, పలుమార్లు ఇరు వర్గాల మధ్య తోపులాటలు జరిగాయి.  

తాజా పరిస్థితుల నేపథ్యంలో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసిన ఢిల్లీ పోలీసులు, జంతర్ మంతర్, కన్నాట్ ప్లేస్‌తో పాటు కీలక ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజా రవాణా కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘట నలు జరగకుండా అప్రమ త్తంగా వ్యవహరిస్తున్నారు.

భద్రత దృష్ట్యా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎమ్ఆర్సీ)  నగరంలోని  16 మెట్రో స్టేషన్లను తదుపరి ఆదేశాలు వెలువడే వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్టేషన్లలో రైళ్లు ఆగవని పేర్కొంది. ఆయా మెట్రో స్టేషన్ల నుంచి ప్రయాణికుల ప్రవేశం, నిష్క్రమణను కూడా నిలిపివేసినట్లు తెలిపింది.

మూసివేసిన మెట్రో స్టేషన్లు లోక్ కళ్యాణ్ మార్గ్, రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, రామకృష్ణ ఆశ్రమ్ మార్గ్, బరాఖంబా రోడ్, సుప్రీంకోర్టు, సేవా తీర్థ్, జనపథ్, మండీ హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్, ఐటీఓ, ఢిల్లీ గేట్, ఇంద్ర ప్రస్థ, ఖాన్ మార్కెట్, జోర్ బాగ్, శివాజీ స్టేడియం మొదలగు మొత్తం 16 మెట్రో సేవలను వినియో గించే ప్రయాణికులు ప్రయాణానికి ముందు తాజా సేవా వివరాలను పరిశీలించాలని, అవస రమైతే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవా లని డీఎమ్ఆర్సీ  సూచించింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, భద్రతా పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన తర్వాతే మెట్రో స్టేషన్లను తిరిగి తెరవనున్నట్లు అధికా రులు వెల్లడించారు.

ఇలా ఉండగా మెట్రో స్టేషన్ల మూసి వేత పట్ల సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. మధ్యహ్నంలోగా సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించింది. మెట్రో స్టేషన్ల మూసి వేత కారణంగా కోర్టుకు హాజరు కాలేకపోయిన న్యాయవాదులపై ఎటువంటి చర్యలూ తీసుకోబోమని పేర్కొంది. 

Closure of 16 Metro stations in Delhi, supreme, serious, order, resolve, immediately

google-ad-img
    Related Sigment News
    • Loading...