4, 5 తేదీల్లో ఈఆర్సీ.నివేదిక సమీక్షిస్తాం ... సి.ఎం.

Chief Minister Kiran Kumar Reddy to have relook at new power rate, Chief Minister Kiran Kumar Reddy To Look into ERC Statement April 4th 5th,   Kiran Kumar Reddy Assures On Power Surcharge Hike April 4th, 5th

 

చిత్తూరుజిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారం కలికిరిలో విలేఖరులతో మాట్లాడుతూ ... ఈ ఏడాది విద్యుత్ సబ్సిడీల కోసం తమ ప్రభుత్వం 5,700 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని, గతేడాది ఈఆర్సీ ఇచ్చిన నివేదిక తర్వాత 5,500 కోట్ల మేర పేదప్రజలకు విద్యుత్ రాయితీ కల్పించామనీ, ఈ ఏడాది కూడా పెడ ప్రజలపై భారం పడకుండా చూస్తామని, ప్రతినెలా 450 నుంచి 550 మెగావాట్ల విద్యుత్ ను యూనిట్ కు 12.20 నుండి 12.30కు కొని రైతులకు ఉచితంగా అందిస్తున్నామని, 50 యూనిట్లకంటే ఎక్కువ విద్యుత్ వినియోగించే వారిపై భారం పడుతోందని, రాష్ట్రంలోని 97 లక్షల గృహ విద్యుత్ కనెక్షన్లలో 50 శాతం దానికి లోబడే ఉన్నందున వారిపై భారం పడదని తెలిపారు. అలాగే ఈ నెల 4,5 తేదీలలో ఈఆర్సీ ఇచ్చే నివేదికపై సమీక్ష నిర్వహిస్తామని, ఏయే రంగాలపై ఎంతెంత భారం పడుతుందో పరిశీలించాక తగిన నిర్ణయం తీసుకుని ప్రకటిస్తామని కిరణ్ కుమార్ హామీ ఇచ్చారు.