సంజూ సెంచరీ.. ముంబైపై చెన్నై సూపర్బ్ విక్టరీ

posted on: Apr 24, 2026 9:02AM

ఐపీఎల్ 2026లోచెన్నై సూపర్ కింగ్స్ విజయాల బాట పట్టింది.  ముంబై వాంఖడే స్టేడియం వేదికగా గురువారం   ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో 103 పరుగుల భారీ ఆధిక్యతతో విజయం సాధించింది. మ్యాచ్ మొత్తం ఏకపక్షంగా సాగింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్‌గా వచ్చిన సంజు శాంసన్ ఆరంభం నుంచే ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 54 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. స్కిప్పర్ రుతురాజ్ గైక్వాడ్ 22,  డెవాల్డ్ బ్రెవిస్ 21 పరుగులు చేశారు.  

అనంతరం 208 పరుగుల భారీ విజయ లక్ష్యంతో  లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. కేవలం 11 పరుగులకే 3 ప్రధాన వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. స్పిన్నర్ అకీల్ హోసేన్  ముంబై బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. సూర్యకుమార్ యాదవ్ 36 పరుగులు, తిలక్ వర్మ 37 పరుగులతో కొద్ది సేపు వికెట్ల పతనాన్ని నిలువరించారు. వారు కూడా ఔటైన తరువాత ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ పేకమేడను తలపించేలా కుప్పకూలింది. దీంతో ముంబై 19 ఓవర్లలో 104 పరుగులకే ఆలౌటై 103 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.  ఈ పరాజయంతో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ ఆశలకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి. ఇక చెన్నై విషయానికి వస్తే ఆ జట్టు ఓపెనర్ సంజుశాంసన్ ఈ సీజన్ లోనే రెండో సెంచరీ సాధించాడు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...