వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమే ప్రభుత్వ లక్ష్యం: చంద్రబాబు

 

వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమే ప్రభుత్వ లక్ష్యం: చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుదవారం సాయంత్రం హైదరాబాదులో గల తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ ప్రస్తుత పరిస్థితులను, దాని అభివృద్ధికి తన ప్రభుత్వం చెప్పట్టబోయే చర్యలను వివరించే శ్వేత పత్రం విడుదల చేసారు. గత పదేళ్లుగా రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ మిగిలిన అన్ని రంగాలను ఏవిధంగా నిర్లక్ష్యం చేసిందో వ్యవసాయాన్ని కూడా అదేవిధంగా నిర్లక్ష్యం చేయడం వలన పంటల దిగుబడి తగ్గిపోయి రైతులు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులలో కూరుకుపోయారని అని ఆయన ఆరోపించారు. వారు ఆ దుస్థితి నుండి బయటపడేందుకే తమ పార్టీ రుణమాఫీకి పూనుకొందని ఆయన తెలిపారు. ఇకపై తమ ప్రభుత్వం పూర్తి స్థాయిలో దిద్దుబాటు చర్యలు చేప్పట్టి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుతుందని తెలిపారు. అందుకోసం ప్రభుత్వం చెప్పట్టబోయే కొన్ని చర్యలను ఆయన ఈ సందర్భంగా వివరించారు. భూసార పరీక్షలు నిర్వహించి భూసారం పెరిగేందుకు తగిన చర్యలు చెప్పట్టడం. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడం. సాంకేతిక విధానంలో పంటలు, నీళ్ళ సంరక్షణ. వ్యవసాయంలో ఆధునిక పద్దతులపై రైతులకు శిక్షణ, అందుకు అవసరమయిన సహాయం అందించడం. ఒక్కో గ్రామాన్ని ఒక యూనిట్ గా పంటలకు భీమా కల్పించడం. కూరలు, పండ్ల తోటల పెంపకానికి ప్రోత్సాహం కల్పించడం వంటి అనేక కొత్త విధానాలు అమలు చేయడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి, రైతులకు అండగా నిలుస్తామని చంద్రబాబు తెలిపారు.