ఇక జగన్ తో చంద్రబాబు ఢీ
posted on: Apr 29, 2014 11:51AM
.jpg)
తెలుగుదేశం పార్టీ సీమాంద్రాతో పోలిస్తే తెలంగాణాలో చాలా బలహీనంగానే ఉందని చెప్పక తప్పదు. పైగా చంద్రబాబు అనుసరించిన వైఖరి వలన తెలంగాణాలో పార్టీకి కొంత వ్యతిరేఖత కూడా ఉంది. మాటల మాంత్రికుడు కేసీఆర్ తెదేపాపై చేసిన విషప్రచార ప్రభావం కూడా ఎంతో కొంత తప్పకుండా ఉంటుంది. ఈవిధంగా తెలంగాణాలో తెదేపాకు అన్ని విధాల వ్యతిరేఖత కనబడుతుంటే, కాంగ్రెస్, తెరాసలకు మాత్రం తెలంగాణా సాధించిన భుజకీర్తులు అదనంగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా తెలంగాణాలో కాంగ్రెస్, తెరాసలకు ధీటుగా తెలుగుదేశం పార్టీని నిలబెట్టగలిగిన ఘనుడు చంద్రబాబు. అక్కడ ఎన్నికల ప్రచారం ముగించుకొని ఇక ఇప్పుడు తనకు బాగా పట్టున్న ఆంధ్ర ప్రాంతంపై చంద్రబాబు దృష్టి సారించనున్నారు. ఈసారి ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ లెక్కలో లేకపోయినప్పటికీ, దానికి బదులుగా వైకాపాను, ముఖ్యంగా దాని అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు ఎదుర్కోవలసి ఉంటుంది. తెలంగాణాలో కాంగ్రెస్, తెరాసలపై బీసీ అస్త్రం ప్రయోగించి నిలువరించ గలిగిన చంద్రబాబు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పై ఎటువంటి అస్త్రాలు సంధిస్తారో అందరికీ తెలుసు. ఆయన ప్రధానంగా జగన్ పై ఉన్న సీబీఐ కేసులు, ఆయన తండ్రి హయాంలో జగన్ చేసిన అవినీతి భాగోతాలు, కాంగ్రెస్ పార్టీతో ఆయనకున్న రహస్య అవగాహన వంటివి ప్రస్తావించడం తధ్యం. అటువంటి అవినీతిపరుడు, పరిపాలనానుభవం లేనివాడికి ఓటేస్తే అది కొరివితో తల గోక్కోన్నట్లే అవుతుందని ప్రజలకు హితబోధ చేయవచ్చును.



.jpg)
.jpg)
.webp)

.webp)


