Latest News

టీమ్ ఇండియాకు చంద్రబాబు అభినందనలు

posted on: Mar 8, 2026 11:50PM

టి 20 వరల్డ్ కప్ ఫైనల్ లో న్యూజిలాండ్ ను చిత్తు చేసి టోర్నీ విజేతగా నిలిచిన టీమ్ ఇండియాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అభినందించారు.  చారిత్రక విజయం సాధించిన జట్టు సభ్యులు యావద్దేశం గర్వపడేలా చేశారని చంద్రబాబు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.  

ఈ విజయంతో టీ20 ఫార్మాట్‌లో భారత్ తన సత్తా   మరోసారి నిరూపించుకుందని పేర్కొన్నారు. మూడుసార్లు కప్ గెలిచిన తొలి దేశంగా భారత్ నిలవడం గర్వకారణమని, జట్టు సభ్యులంతా  సమష్టిగా రాణించారని పేర్కొన్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...