Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రిలయన్స్ ఏడీఏ గ్రూప్కు సీబీఐ షాక్!
posted on: May 30, 2026 10:13AM
.webp)
అనిల్ అంబానీ సంస్థలపై సీబీఐ తొలి ఛార్జిషీట్..
రిలయన్స్ ఏడీఏ గ్రూప్కు చెందిన రుణాల మోసం కేసులో సీబీఐ కీలక ముందడుగు వేసింది. అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) సంస్థకు సంబంధించిన కేసులో తొలి ఛార్జిషీట్ను ముంబై ప్రత్యేక సీబీఐ కోర్టులో దాఖలు చేసింది. ఈ పరిణామం కార్పొరేట్ రంగంలో చర్చనీయాంశంగా మారింది.
ఈ ఛార్జిషీట్లో మొత్తం 16 మందిని నిందితులుగా చేర్చారు. రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థతో పాటు ఆ కంపెనీకి చెందిన ఐదుగురు సీనియర్ అధికారులు, అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, మాజీ సిండికేట్ బ్యాంక్కు చెందిన పది మంది బ్యాంకు అధికారులపై అభియోగాలు మోపారు. వీరిపై నేరపూరిత కుట్ర, మోసం, అధికార దుర్వినియోగం, అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు.
సీబీఐ దర్యాప్తు ప్రకారం, కంపెనీకి మంజూరైన భారీ రుణాలను అసలు ఉద్దేశాలకు విరుద్ధంగా ఇతర అవసరాలకు మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.1,200 కోట్ల టర్మ్ లోన్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి రూ.500 కోట్ల లెటర్ ఆఫ్ క్రెడిట్ సౌకర్యం, సిండికేట్ బ్యాంక్ నుంచి రూ.350 కోట్ల లెటర్ ఆఫ్ క్రెడిట్ సౌకర్యం పొందినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ నిధులను ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా వినియోగించినట్లు సీబీఐ అనుమానిస్తోంది.
ఈ కేసులో మరో కీలక అంశం కూడా వెలుగులోకి వచ్చింది. మొత్తం 17 ప్రభుత్వ రంగ బ్యాంకులు రిలయన్స్ గ్రూప్ సంస్థలకు భారీ మొత్తంలో రుణాలు మంజూరు చేసినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఈ రుణాల మొత్తం ఎక్స్పోజర్ విలువ రూ.19,694.33 కోట్లుగా ఉన్నట్లు సమాచారం. ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మాత్రమే సుమారు రూ.2,929 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఇప్పటికే రిలయన్స్ గ్రూప్కు చెందిన ఇతర సంస్థలపై కూడా పలు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఆర్కామ్, ఆర్హెచ్ఎఫ్ఎల్, ఆర్సీఎఫ్ఎల్, ఆర్టీఎల్ వంటి సంస్థల ఆర్థిక లావాదేవీలపై సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇతర బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు, నిధుల మళ్లింపులు, ఇందులో పాత్ర పోషించిన వ్యక్తులపై కూడా విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
త్వరలోనే ఈ కేసుకు సంబంధించి మరిన్ని ఛార్జిషీట్లు దాఖలయ్యే అవకాశం ఉందని సమాచారం. అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ సంస్థలపై నమోదైన మొత్తం ఏడు కేసుల దర్యాప్తును సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తుండటంతో ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.


.webp)



