రోడ్డు ప్రమాదంలో కారు దగ్ధం

posted on: Nov 8, 2025 8:43AM

 

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కారు పూర్తిగా దగ్ధమయ్యింది. అతి వేగంగా వెడుతున్న కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.  అయితే ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదు.

డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో కారులో ఉన్న ఎనిమిది మందీ సురక్షితంగా బయటపడ్డారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే కారు రోడ్డుకు అడ్డంగా పడిదగ్ధం కావడంతో హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...