Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...క్రమశిక్షణ కోసం బెత్తంతో కొట్టడం నేరం కాదు...కేరళ హైకోర్టు కీలక తీర్పు
posted on: Apr 19, 2026 10:47AM

పాఠశాలల్లో విద్యార్థులను క్రమశిక్షణలో ఉంచేందుకు ఉపాధ్యాయులు తీసుకునే చర్యలను ప్రతిసారి నేరంగా పరిగణించలేమని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. క్రమశిక్షణలో భాగంగా విద్యార్థిని బెత్తంతో కొట్టిన ఉపాధ్యాయుడిపై నమోదైన క్రిమినల్ కేసును కోర్టు రద్దు చేసింది.
జస్టిస్ సి. ప్రదీప్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించి కీలక వ్యాఖ్యలు చేసింది. తిరువనంతపురంలోని ఒక పాఠశాలలో విద్యార్థి ప్రవర్తన సరిగా లేదన్న కారణంతో, ఉపాధ్యాయుడు స్టాఫ్ రూమ్లో బెత్తంతో కొట్టాడని ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో భారతీయ న్యాయ సంహిత మరియు జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద సెక్షన్లు కూడా చేర్చారు.
ఈ చర్యలను సవాల్ చేస్తూ ఉపాధ్యాయుడు హైకోర్టును ఆశ్రయించగా, విచారణలో కోర్టు పలు అంశాలను పరిశీలించింది. ఉపాధ్యాయుడు ఉపయోగించిన ‘బెత్తం’ చట్టపరంగా ప్రమాదకరమైన ఆయుధంగా పరిగణించబడదని కోర్టు పేర్కొంది. విద్యార్థికి సంబంధించిన మెడికల్ రిపోర్టులను పరిశీలించినప్పుడు ఎటువంటి తీవ్రమైన గాయాలు లేవని తేలిందని, అలాగే ఘటన జరిగిన చాలా రోజుల తర్వాత ఆసుపత్రికి వెళ్లడం కూడా అనుమానాస్పదమని అభిప్రాయపడింది.
ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుడి చర్యలో ‘మెన్స్ రియా’ (నేరపూరిత ఉద్దేశం) లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. విద్యార్థిని క్రూరంగా వేధించాలనే ఉద్దేశం కాకుండా, కేవలం క్రమశిక్షణ కోసం మాత్రమే చర్య తీసుకున్నారని కోర్టు భావించింది.
“ఉపాధ్యాయులకు విద్యార్థులను క్రమశిక్షణలో ఉంచేందుకు పరిమిత అధికారాలు ఉన్నాయి. ఆ చర్యలు సదుద్దేశంతో, కోపం లేదా క్రూరత్వం లేకుండా జరిగితే అవి నేరంగా పరిగణించలేము,” అని కోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి కేసులను కొనసాగించడం వల్ల ప్రయోజనం ఉండదని పేర్కొంటూ, ఉపాధ్యాయుడిపై నమోదైన అన్ని చట్టపరమైన చర్యలను కోర్టు రద్దు చేసింది.



.webp)


