Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఎయిడ్స్ రక్తం ఎక్కించిన ప్రియుడు.. యువతి ఆత్మహత్య
posted on: Apr 10, 2026 3:05PM
.webp)
పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో ప్రియుడు ప్రియురాలికి ఇంజక్షన్ ద్వారా ఎయిడ్స్ రక్తంఎక్కించిన ఘటన తీవ్ర సంచ లనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన రాజు వెడ్స్ రాంబాయి చిత్రంలో కూడా తన ఇష్టానికి వ్యతిరేకంగా కుమార్తె ప్రేమ వివిహం చేసుకోవడానికి సిద్ధపడటంతో కుమార్తెకు సిరెంజి ద్వారా ఎయిడ్స్ రక్తం ఎక్కిస్తాడు. సరిగా జనగాం జిల్లాకు చెందిన మనోహర్ తనతో వివాహానికి నిరాకరించిందన్న కోపంతో ప్రియురాలు రమణికి ఎయిడ్స్ రక్తం ఎక్కించాడు. అయితే మనోహర్ ఎయిడ్స్ రక్తం ఎక్కించిన యువతి ఇప్పుడు ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెడితే.. యువతి ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబంలో చీకట్లు కమ్ముకున్నాయి.
జనగాం జిల్లాకు చెందిన మనోహర్ కుటుంబం 13 ఏళ్ల క్రితం జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్ నగరానికి వచ్చి పోచారం పరిధిలో నివాసం ఉంటున్నారు. మనోహర్ మరదలు రమణి హైదరా బాద్ నగరంలోని పోచారం ఐటి కారిడార్ అన్నోజిగూడ రాజీవ్ గృహకల్ప లో నివాసం ఉంటున్నారు. వీరిద్దరికీ కొద్ది కాలం కిందటే వివాహం నిశ్చయమైంది. అయితే.. హెచ్ఐవి పాజిటివ్ తో ఇటీవల మనోహర్ తల్లి మరణించింది. మనోహర్ తండ్రికి కూడా ఎయిడ్స్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది.
దీంతో మనోహర్ కూడా ఎయిడ్స్ ఉండి ఉండొచ్చని భావించిన రమణి తల్లిదండ్రులు పరీక్ష చేయిస్తే మనోహర్ కు కూడా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో రమణి మనోహర్ ను వివాహం చేసుకోవడానికి నిరాకరించింది. దీంతో ఆగ్రహం చెందిన మనోహర్ ఎయిడ్స్ రక్తంతో ఉన్న ఇంజక్షన్ యువతికి ఇస్తే తనకు కూడా ఎయిడ్స్ వస్తుందని అప్పుడు తనను వివాహం చేసుకుంటుందని భావించాడు.
పథకం ప్రకారం.. మార్చి 11న రమణ కి బలవంతంగా ఇంజక్షన్ ద్వారా ఎయిడ్స్ రక్తం ఎక్కించాడు. ఈ ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. పోలీసులు మనోహర్ని అరెస్టు చేసి జైలుకు పంపించారు. అయితే ఎయిడ్స్ రక్తాన్ని తనకు సిరంజి ద్వారా ఎక్కించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన రమణి.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో శుక్రవారం (ఏప్రిల్ 10) ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చరికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



.webp)


