మీర్ పేట్ లో పేలుడు.. ఒకరి మృతి

posted on: Jun 22, 2026 8:49AM

హైదరాబాద్‌  భారీ పేలుడు సంభవించి ఒకరు మృతి చెందారు. ఈ ఘటన మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని  బడంగ్‌పేట్‌లోని ఓ గోడౌన్ లో  ఆదివారం (జూన్ 21) జరిగింది.  మృతుడిని పశ్చిమ బెంగాల్ కు చెందన అనూప్ ప్రధాన్ గా గుర్తించారు.   కొద్ది రోజుల కిందట కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు బతుకు తెరువు కోసం వలస వచ్చినట్లు తెలుస్తోంది. 
 
గోడౌన్‌లో నిల్వ ఉంచిన పెయింట్లు,  రసాయనాల వల్లే ఈ ప్రమాదం సంభవించి ఉండొచ్చని  పోలీసులు   అనుమానిస్తున్నారు. పేలుడు ధాటికి అనూప్ ప్రధాన్ శరీనం ఛిత్రమై శరీర భాగాలు పది మీటర్ల దూరం వరకూ ఎగిరి పడ్డాయి. ఈ ఘటనలో గోడౌన్ యజమాని నిర్లక్ష్యం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఫోరెన్సిక్ నిపుణులు, డాగ్ స్క్వాడ్ ఘటనా స్థలం నుండి కీలక ఆధారాలను సేకరించాయి. నిపుణుల నివేదిక అందిన తర్వాతే పేలుడుకు గల కచ్చితమైన కారణాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం సంభవించలేదని, ఇతర వ్యక్తులకు ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు స్పష్టం చేశారు.            

google-ad-img
    Related Sigment News
    • Loading...