మే 15న బాబుకు షాక్ తగలనుందా...!

posted on: Apr 28, 2018 5:52PM

 

మే 15 న ఏపీ ముఖ్యమంత్రికి షాక్ తగలనుందా... ? అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. ఈ భయంకరమైన నిజం చెప్పింది ఎవరో కాదు బీజేపీ  ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. మిత్రపక్షంగా ఉన్నప్పుడే టీడీపీ, బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకునేవారు. ఇప్పుడు ఏకంగా విడిపోవడంతో.. మాటలతో యుద్దాలే చేసుకుంటున్నారు. ఒకపక్క చంద్రబాబు మోడీపై, బీజేపీ చురకలు అంటిస్తుంటే.. మరోపక్క బీజేపీ నేతలు కూడా చంద్రబాబు పై విమర్సలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మీడియా మాట్లాడిన ఆయన.. పట్టిసీమపై అవకతవకలు జరిగాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో కావాలంటే విచారణను జరిపించి రుజువుచేయమని టీడీపీ నేతలు అడుగుతున్నారని, పట్టిసీమ ప్రాజెక్టులో వారు చేసిన గోల్ మాల్  లపై ఒక నివేదికను తయారుచేసి, దానిని సీబీఐకి అప్పగించి టీడీపీ నేతల భరతం పడతానని హెచ్చరించాడు. విచారణను జరిపించమని జూపూడి గారు సరదా పడుతున్నప్పుడు ఆయన సరదాను తీరుస్తానని ఎద్దేవా చేసాడు. అంతేకాదు... టీడీపీ తో తాము పొత్తు పెట్టుకోకున్నట్లయితే మరిన్ని సీట్లు గెలిచే వారిమని తెలిపాడు. ఎట్టిపరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికలలో టీడీపీ గెలవలేదని జోస్యం చెప్పాడు. మే15 లోపు చంద్రబాబుకు షాక్ తగలనుందని.. టీడీపీ లోని చాలామంది నేతలు వైసీపీలోకి జంప్ అవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి బాంబు పేల్చాడు. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మే 15 వరకూ ఆగాల్సిందే...

google-ad-img
    Related Sigment News
    • Loading...