బైకర్ రితీష్ రెడ్డి మృతిపై కేసు నమోదు
posted on: Feb 16, 2026 5:47PM

నల్గొండ జిల్లా చిట్యాల పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అంతర్జాతీయ బైకర్ రితీష్ రెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. బైకర్ రితీష్ రెడ్డి మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బైకర్ రితీష్ రెడ్డి బైక్ పై వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అతను ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై రితీష్ సోదరుడు రోహిత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిట్యాల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
ప్రమాదంలో రితీష్ రెడ్డి తలకు తీవ్ర గాయమైందని, అదే మృతికి కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తు న్నారు. ఈ క్రమంలోనే పోలీసులు ప్రమాదానికి గురైన అతని బీఎండబ్ల్యూ బైక్కు అమర్చిన ఫ్రంట్, బ్యాక్ కెమెరాల ఫుటేజ్ను స్వాధీనం చేసుకుని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రమాద సమయంలో ముందూ, వెనుకుగా ప్రయాణించిన వాహనాల వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. ఢీకొట్టి పారిపోయిన వాహనం గుర్తించేందుకు ఆయా ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను కూడా పరిశీలిస్తున్నారు.
అయితే బైకర్ రితీష్ రెడ్డి బాపట్లలో హార్లే డేవిడ్సన్ మోటార్స్ నిర్వహించిన ఈవెంట్కు హాజరై హైదరాబాద్కు తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసులు పోస్టుమార్టం అనంతరం రితీష్ రెడ్డి మృతదేహాన్ని కుటుంబసభ్యులు బంజారాహిల్స్లోని ఆయన నివాసానికి తీసుకువచ్చారు. ప్రముఖ బైకర్ మృతితో బైకింగ్ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనకు కారణమైన వాహనం, డ్రైవర్ను గుర్తించేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నామని చిట్యాల పోలీసులు తెలిపారు. రితీష్ రెడ్డి మృతి చెందడంతో ఆ కుటుంబంలో చీకట్లు కమ్ముకున్నాయి



.webp)


