అశోక్ థామ్ ఆలయంలో తొక్కిసలాట.. ఆరుగురు మృతి.!

posted on: Aug 17, 2026 9:13AM

బీహార్ రాష్ట్రంలోని లఖిసరాయ్ జిల్లాలోని ప్రసిద్ధఅశోక్ ధామ్ ఆలయం వద్ద సోమవారం (ఆగస్టు 17) తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు దుర్మరణంపాలయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.  శ్రావణ మాసం అందులోనూ  సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు అశోక్ థామ్ ఆలయానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు.

శ్రావణ  సోమవారం నాడు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అభిషేకాలు జరిపించాలని సుదూర ప్రాంతాల నుండి భక్తులు ఆశోక్ ధామ్  క్షేత్రానికి పోటెత్తారు. ఆలయ ప్రాంగణమంతా హరహర మహాదేవ శంభో శంకర స్మరణలతో మార్మోగింది. రద్దీఅధికంగా ఉండటంతో ఒక్కసారిగా తొక్కిసలాట మొదలైంది.  ఉదయం ఆరున్న ఆరు   6:45 గంటల మధ్య  సమీప రైల్వే స్టేషన్‌కు ఒకేసారి రెండు రైళ్లు వచ్చాయి. ఆ రైళ్లలో వచ్చిన వేలాది మంది భక్తులు ఒకే సమయంలో ఆలయ ప్రాంగణానికి చేరుకోవడంతో ఆలయం వద్ద రద్దీ మరీ ఎక్కువైంది.

అందరూ ఒకే సారి ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో ఆలయ మార్గంలో ఉన్న  బ్యారికేడ్లు   కూలిపోవడంతో ముందు వరుసలో ఉన్న భక్తులు ఒకరిపై ఒకరు పడిపోయారు. కిందపడిన వారిని వెనుక ఉన్న జనం గమనించకుండా ముందుకు నెట్టుకురావడంతో   తొక్కిసలాట జరిగింది. ఈ దురదృష్టకర ఘటనలో ఆరుగురు భక్తులు అక్కడికక్కడే  ప్రాణాలు కోల్పోగా, పలువురు  తీవ్రంగా గాయపడ్డారు. 

 సమాచారం అందుకున్న   జిల్లా ఉన్నతాధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేశారు. క్షతగాత్రులను  సమీపంలోని ప్రభుత్వాసుపత్రులకు తరలించి వైద్య సహాయం అందిస్తున్నారు.  

Bihar temple stampede, lakhisarai ashok dham,  Shravan Somwar Tragedy, Temple stampede, Ashok dham, TeluguOne

google-ad-img
    Related Sigment News
    • Loading...