భూమా సహా ముగ్గురు ఎమ్మెల్యేలు జంప్..

posted on: Feb 23, 2016 9:02AM

భూమా నాగిరెడ్డి, భూమా అఖిల ప్రియల పార్టీ మార్పుపై ఎట్టకేలకు తెరపడింది. గత మూడు రోజులుగా నడుస్తున్న డ్రామాకు ఫుల్ స్టాప్ పెడుతూ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ టీడీపీలోకి చేరిపోయారు. వీరితో పాటు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌తో పాటు ఎమ్మెల్సీ నారాయణరెడ్డిలు టీడీపీ అధినేత..సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...