Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నా కొడుకు కేసులో నా పేరు వాడొద్దు...కోర్టును ఆశ్రయించిన కేంద్ర మంత్రి
posted on: May 15, 2026 6:50PM
.webp)
బాలిక వివరాలు సోషల్ మీడియాలో పెట్టిన వారిపై కేసు నమోదు..
హైదరాబాద్లో సంచలనం గా మారిన బండి సంజయ్ కుమార్ కుమారుడికి సంబంధించిన కేసు నేపథ్యంలో కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దుష్ప్రచారాన్ని తక్షణమే నిలిపివేయాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.ఇప్పటి వరకు సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, శాటిలైట్ ఛానెళ్లలో ప్రసారం చేసిన వీడియో క్లిప్పింగులు, పత్రికా కథనాలు, డిజిటల్ కంటెంట్, వాల్ పోస్టర్లు వంటి పరువు నష్టం కలిగించే సమాచారాన్ని ఈ నెల 26లోపు తొలగించా లని కోర్టు ఆదేశించింది.
ఇకపై ఇలాంటి దుష్ప్రచారం కొనసాగితే కోర్టు ధిక్కరణ చట్టం సహా ఇతర చట్టాల కింద కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. కోర్టు జారీ చేసిన ఈ గ్యాగ్ ఆర్డర్ అన్ని డిజిటల్ మరియు శాటిలైట్ మీడియా సంస్థలు, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా గ్రామ్, వాట్సాప్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా వేదికలు మరియు ఇతర మధ్యవర్తులకు వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వుల లక్ష్యం సంబంధిత పక్షాల గౌరవం, గోప్యతను కాపాడడం మాత్రమే కాకుండా మీడియా విచారణల వల్ల న్యాయ ప్రక్రియకు ఆటంకం కలగకుండా చూడటమేనని న్యాయవాది తెలిపారు.
పోలీసుల కీలక ప్రకటన ఇదిలా ఉండగా మరోవైపు పేట్ బషీరాబాద్ పోలీసులు ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు.
ఈ పోక్సో చట్టం కింద నమోదైన FIR No.684/2026 కేసులో బాధిత బాలిక వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో పోలీసులు మరింత కఠిన చర్యలకు దిగారు. బాలిక ఫోటోలు, వీడియోలు, తల్లిదండ్రుల వివరాలు ప్రచారం అవుతున్నాయని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాలల సంక్షేమ కమిటీ ఫిర్యాదు మేరకు మరో కేసు (FIR No.706/2026) నమోదు చేశారు.






