తెలంగాణలో 10న విద్యా సంస్థల బంద్‌.!

posted on: Jul 7, 2026 2:37PM

తెలంగాణలో ఈ నెల 10 విద్యాసంస్థల బంద్ కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. రాష్ట్రంలో నెలకొన్న విద్యా రంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు ఈ బంద్ కు పిలుపు ఇఛ్చాయి. ఈ మేరకు బంద్‌ను జయప్రదం చేయాలని కోరుతూ వరంగల్ జిల్లా నెక్కొండలె ఏఐఎస్ఎఫ్,  పీడీఎస్యూ, ఎస్ఎఫ్ఐల ఆధ్వర్యంలో మంగళవారం (జులై 7)  పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. విద్యా రంగం పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని గర్హించారు. దీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న   విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో  ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శలు గుప్పించారు.  కాగా ఈ సందర్భంగా పలు డిమాండ్లను విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వం ముందు ఉంచారు. ఇవీ ఆ డిమాండ్లు... 

- బకాయి పడ్డ ఫీజు రీఇంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి.

- ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు,   హాస్టళ్లలో  తాగునీరు, మరుగుదొడ్లు, నాణ్యమైన భోజనం. మౌలికవసతులు కల్పించాలి.

 - విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి.

- ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఇష్టారాజ్యంగా పెంచుతున్న ఫీజులను నియంత్రించాలి. 

July10th, Long Standing. Pending, Problems, Poster

google-ad-img
    Related Sigment News
    • Loading...